Vijayashanthi: సీనియర్ ఎన్టీఆర్‌ని, కళ్యాణ్ రామ్‌ని పోలుస్తూ విజయశాంతి సంచలన ట్వీట్.. ఏం జరిగిందంటే?

Vijayashanthi: తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా తన గంటలకు ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించి తన అందం అభినయం నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత కాలంలో నెమ్మదిగా సినిమాలకు దూరం అవుతూ వచ్చిన విజయశాంతి సినిమాలకు మాత్రమే కాకుండా రాజకీయాలకు కూడా దూరం అయ్యింది. ఇక మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది విజయశాంతి.

ఇప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్ 21వ సినిమాలోనూ నటించబోతోంది. ఇది ఇలా ఉంటే ఇటీవల NKR21 సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై NKR21 సినిమాని నిర్మిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. కాగా ఇందులో హీరోయిన్ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించనుంది. ఇక ఈ సినిమాలో విజయశాంతి ముఖ్య పాత్ర చేస్తున్నట్టు ప్రకటించారు చిత్ర యూనిట్. తాజాగా విజయశాంతి ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ సీనియర్ ఎన్టీఆర్ ని, కళ్యాణ్ రామ్ ని పోలుస్తూ ఒక ట్వీట్ చేయగా అది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విజయశాంతి సీనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. ఆనాడు లెజెండ్ ఎన్టీఆర్ గారు 30 సంవత్సరాల ముందు ఒక సినిమా ప్రారంభం నాడు నాకు ఇచ్చిన గౌరవం, అట్లే ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమా ముహూర్తం రోజు నాకు ఇచ్చిన గౌరవం.. ఎప్పుడూ కూడా కళాకారిణిగా నాకు ప్రోత్సాహం, ప్రేరణ కల్పించే సందర్భాలే.. అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్ చూసిన ఎన్టీఆర్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -