Manchu Manoj: నా కెరీర్ ఖతమన్నారు.. మౌనంగా తిరిగొస్తున్నా.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు!

Manchu Manoj: రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరూ ఉండరు. మంచు కుటుంబంలో సరైన మెచ్యూర్డ్ కాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే అది మంచు మనోజ్ అని తెలుగు ప్రేక్షకులు అందరికీ తెలుసు. చేసిన సినిమాలు తక్కువ అయినా సరే ఈయనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానం అంతా ఇంతా కాదు. సినిమా ప్రేక్షకులు ఈయన కోసం ప్రాణం పెడతారు అలాంటి మంచి మనసు ఉన్న మంచు మనోజ్ సినిమాలకు చాలా సంవత్సరాల నుంచి దూరం అయ్యాడు.

ఒక్కడు మిగిలాడు అనే సినిమా 2017లో విడుదలైంది ఇదే ఇతని ఆఖరి సినిమా. దాని తర్వాత అతిధి పాత్రలలో మెరిసినా సరే తాను హీరోగా ఒక సినిమా కూడా ఇప్పటికీ వచ్చి తీయలేదు. దాని తర్వాత ఒక సినిమా గురించి ప్రకటన వచ్చినా సరే దాని గురించి ఇంకేం అప్డేట్స్ రాలేదు. మొన్న మొన్న కూడా మనం మనం బరంపురం అనే ఒక టాగ్ లైన్ తో సినిమా ప్రకటించారు.

దాని గురించి కూడా ఇంకే అప్డేట్స్ రాకపోవడంతో ఇంక మనోజ్ పని ఇండస్ట్రీలో అయిపోయింది ఇంక హీరోగా పనికిరాడు అని చాలామంది అన్నారు. అయితే ఈమధ్య ఓటీటీ కోసం ఒక ప్రోగ్రాం చేస్తున్నట్టు ప్రకటించారు మంచు మనోజ్. దీనికోసం ప్రోమోగా ఒక వీడియోని విడుదల చేశారు. చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ప్రాణం. సినిమాలో నా జీవితాన్ని నేను చూసుకున్నాను. అందుకే సినిమాల్లోకి వచ్చి నా ప్రొఫెషన్ గా చేసుకున్నాను.

రాకింగ్ స్టార్ గా ఎనర్జీ స్టార్ గా చాలా సినిమాల్లో అందరి ఆదరణలు, అందరి అరుపులు విన్నాను. కానీ ఒకేసారి నా జీవితంలోకి నిశ్శబ్దం వచ్చింది అని నిశ్శబ్దాన్ని విని అందరూ నా పని అయిపోయింది ఇంక నేను సినిమాల్లోకి రాను అని అన్నారు. అవన్నీ విన్నాను మౌనంగా భరించాను ఇప్పుడు తిరిగి వస్తున్నాను అని అన్నారు మంచు మనోజ్. ఈయన కం బ్యాక్ కోసం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గట్టిగా ఎదురుచూస్తుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -