Free Tickets: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కృతి సనన్ జంటగా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం ఆది పురుష్. ఈ సినిమా జూన్ 16వ తేదీన స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూడాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది.
ఇలా చిన్న పిల్లలకు కోసం అలాగే అనాధల కోసం ఈ సినిమాని చూడటానికి పెద్ద ఎత్తున సెలబ్రిటీలు ముందుకు వచ్చారు. ఇలా ఇప్పటికే పలువురు హీరోలు కొన్ని వేల టికెట్లను కొనుగోలు చేసి అనాధలకు చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ భూమ మౌనిక దంపతులు సైతం పెద్ద ఎత్తున ఈ సినిమాని ప్రమోట్ చేయడమే కాకుండా ఏకంగా 2500 మంది అనాధ చిన్నారుల కోసం ప్రత్యేకంగా స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు.
ఇక ఈ విషయాన్ని భూమా మౌనిక దంపతులు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రతి ఒక్కరు ఏ విధమైనటువంటి హద్దులు లేకుండా ఒక వేడుకల జరుపుకునే సినిమానే ఆది పురుష్. జీవితంలో చాలా అరుదుగా వచ్చే అవకాశాలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లోని 2500 మంది అనాథ చిన్నారులకు మైథలాజికల్ మాస్టర్ పీస్ రామాయణం ఆధారంగా వస్తున్న ఆదిపురుష్ చిత్రాన్ని జూన్ 16న చూపించాలని నిర్ణయించాం.
బృహస్పతి టెక్, నమస్తే వరల్డ్తో కలిసి ఈ గొప్ప కార్యక్రమం చేస్తున్నట్టు తెలియజేశాడు మనోజ్. మంచు మనోజ్-మౌనిక దంపతుల గొప్ప మనసుపై అందరూప్రశంశాల కురిపిస్తున్నారు అనాధ చిన్నారులకు ఇలాంటి ఒక గొప్ప సినిమాను చూపించాలన్న ఉద్దేశంతో ఈ దంపతులు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడంతో వీరిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.