Manchu Manoj: మంచు మనోజ్ ను పెళ్లి చేసుకోమని వేధించిన హీరోయిన్ ఆమేనా.. ఇంతలా దిగజారి ప్రవర్తించిందా?

Manchu Manoj: టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు వారసుడిగా మంచు మనోజ్ అందరికీ ఎంతో సుపరిచితమే. ఈయన ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే మంచు మనోజ్ కెరియర్ విషయం పక్కనపెట్టి ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే వ్యక్తిగత విషయంలో కూడా ఈయన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారని చెప్పాలి మొదట్లో మంచు మనోజ్ ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.

వీరిద్దరిది పెద్దలు కుదుర్చిన వివాహం కావడంతో ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ సెలబ్రిటీలు మొత్తం తరలివచ్చారు. ఇలా వీరి వివాహ వేడుక ఎంతో కనుల పండుగగా జరిగింది. అయితే వీరి వివాహమైన తర్వాత ఏడాదికి ఇద్దరు మధ్య గొడవలు మొదలై విడాకులు తీసుకొని విడిపోయారు అయితే మనోజ్ ప్రణతి మధ్య మనస్వర్తలు రావడానికి టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఒక స్టార్ హీరోయిన్ కారణమని తెలుస్తోంది. మంచు మనోజ్ తో కలిసి ఒక సినిమాలో మాత్రమే నటించారు.

ఇలా ఈ సినిమా సమయంలో మంచు మనోజ్ పై కాస్త ఇంట్రెస్ట్ చూపినటువంటి ఆ హీరోయిన్ చివరికి తనని ప్రేమిస్తూ తానే సర్వస్వం అనేలా బతికారట ఇలా తన ప్రేమ విషయాన్ని ఆ హీరోకి చెప్పి తనని పెళ్లి చేసుకోమని వెంట పడ్డారట. ఇలా ఆమె తన ప్రేమ విషయాన్ని వ్యక్తం చేయడంతో మనోజ్ నిన్ను నేను ఎప్పుడూ ఒక స్నేహితురాలిగా నేను చూశాను తప్ప ఆ ఉద్దేశంతో ఎప్పుడూ చూడలేదని అయినా నాకు పెళ్లి కూడా జరిగిపోయింది అంటూ తనని దూరం పెట్టారు.

ఇలా ఆ హీరోయిన్ మనోజ్ వెంట పడటంతో తన భార్య ప్రణతికి అనుమానం వచ్చి ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి దీంతో మనోజ్ ఈ విషయాన్ని స్వయంగా తన తండ్రి మోహన్ బాబుకు తెలియచేయగా ఆయన ఆ హీరోయిన్ ని స్వయంగా ఇంటికి పిలిచి మరి వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఆమె మాత్రం కొత్త కొత్త నెంబర్ల నుంచి మనోజ్ కి ఫోన్ చేసి విసిగించడంతో ఈ విషయం గురించి తన భార్యతో మనోజ్ కి భారీగా గొడవలు జరిగాయట. ఇలా గొడవలు జరగడం వల్లే ఇద్దరు పోయారని తెలుస్తోంది. ఇక మొదటి భార్య విడాకులు ఇవ్వడంతో మనోజ్ కొన్ని రోజులపాటు ఒంటరిగా ఉన్నప్పటికీ తరువాత భూమా మౌనిక రెడ్డితో ప్రేమలో పడ్డారు. ఇక వీరిద్దరూ కూడా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -