Weight Loss: యువతులు, మహిళలు తమ, తమ బరువును తగ్గించుకునేందుకు వివిధ రకాల మందులు వాడుతూ.. వ్యాయామాలు చేస్తుంటారు. అవేమీ కాకుండా సబ్జాను నానబెట్టిన నీటిని తాగాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. సబ్జా గింజలతో నానబెట్టిన గ్లాసుడు నీటిని నిద్రపోయే ముందు తాగితే చక్కటి ఫలితాలుంటాయట. ఈ నీరు యాంటీ బయాటిక్లాగా పనిచేస్తూ బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది.
ఈ నీటిని రాత్రిపూట తాగడం వల్ల మరుసటి రోజు శరీరంలో పేరుకున్న వ్యర్థాలన్నీ తొలగిపోతాయి. ఈ నీరు టైప్–2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాక ఈ నీరు దాహార్తిని తీర్చి డీహైడ్రేషన్ రాకుండా చూడడంతో పాటు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది. శరీరంలోని కేలరీలను కరిగించడంలో సబ్జాగింజలకు తిరుగులేదు. ఎవరైతే బరువు తగ్గాలనుకుంటారో వారు సబ్జా నీటిని తాగాలని సూచిస్తున్నారు.
ఇంకా సబ్జా గింజలను నీటిలో నానబెట్టి తాగడంతో శరీర జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి ఉబ్బి జెల్ మాదిరిగా మారుతాయి. శరీర పనితీరుకు ఉపకరించే ఫ్యాటీ ఆమ్లాలతోబాటు అధికంగా పీచుని కలిగి ఉంటాయి. ఇందులో మహిళలకు అవసరమైన ఫోలేట్, నియాసిన్, ఇంకా చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్ ’ఇ’ లభించడంతోబాటు, శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించడానికి కూడా ఇవి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు
అంటున్నారు.
తయారు చేసుకోండి ఇలా..
సబ్జా గింజలను నీళ్లల్లో వేసి 5–6 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత దానిలో కొంచెం నిమ్మరసం కలుపుకొని తాగాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తే క్రమంగా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది. రుచి కోసం తేనె కూడా కలపవచ్చు. తేనె కూడా బరువు తగ్గటంలో సహాయపడుతుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకుంటే ఇంకా మందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.