తెలుగు రాష్ట్రాల ప్రజలకు గాజువాక కు చెందిన లేడీ కండక్టర్ ఝాన్సీ గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. కేవలం ఒక్క పాటకు డాన్స్ చేసి ఓవర్ నైట్ సెలబ్రిటీ హోదాలో గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఉద్యోగం విషయానికొస్తే ఆమె కండక్టర్ అయినప్పటికీ.. డాన్స్ అంటే చాలా ఇష్టమట.
మరి ఆ మోజు తోనే శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో డాన్స్ చేసే అవకాశం దక్కించుకుంది. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా ఫస్ట్ టైం షోలో అడుగు పెట్టింది. ఆ ఎపిసోడ్లో ఎవరూ ఊహించిన విధంగా గప్పు చిప్పు గంతులు ఎప్పుడు అన్న పాటకి ఊహించని స్థాయిలో తన పర్ఫామెన్స్ ను కనపరిచింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో పల్సర్ బైక్ సాంగ్ కి ఒక రేంజ్ లో స్టెప్పులు వేసింది ఝాన్సీ.
ఈ పాటకు ఝాన్సీ ఒక రేంజ్ లో ఆడిందని చెప్పవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను మరో స్థాయిలో ఆశ్చర్యపరిచింది. మొత్తానికి ఝాన్సీ ఈ పాటతో ఊహించని స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది. మరిప్పుడు ఆ పాటను మించి పోయే విధంగా మరోసారి అదే షోలో దుమ్ము రేపుతుంది అన్నట్లు తెలుస్తుంది. దీని గురించి తర్వాత వారం తాజాగా విడుదల చేసిన ప్రోమోను చూస్తే అర్థమవుతుంది.
వెంటపడి వచ్చేవాళ్లు కుర్రాళ్ళు అంటూ ఆ ప్రోమోలో ఝాన్సీ ఒక రేంజ్ లో ఆడుతుంది. ఈ ప్రోమో చూసిన నెటిజెన్స్.. ఝాన్సీ పర్ఫామెన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఇలా ప్రతివారం శ్రీదేవి డ్రామా కంపెనీలో.. ఝాన్సీ పర్ఫామెన్స్ ఉండేలా చూస్తున్నట్లు తెలుస్తుంది. మరి తర్వాత వారంలో ఝాన్సీ రెండు రాష్ట్రాల ప్రజలను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి. మరి మీరు ఎందుకు లేట్ చేస్తున్నారు.. మీరు కూడా ఆ ప్రోమో వైపు ఒక లుక్కెయ్యండి. ప్రస్తుతం ఆ ప్రోమో యూట్యూబ్లో వైరల్ గా మారింది.