Anasuya Bharadwaj: అనసూయ వీసా క్యాన్సిల్.. ఆంటీ ట్రెండ్ తో బయటకొచ్చిన రహస్యం?

Anasuya Bharadwaj: బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి అనసూయ ఈటీవీలో మల్లెమాలవారు నిర్వహిస్తున్న జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా మారి ఈ కార్యక్రమంతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో యాంకర్ గా మంచి గుర్తింపు పొందిన ఈమె సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.ఈ విధంగా పలు సినిమాలలో నటిస్తున్నటువంటి అనసూయకు రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ఎంతో అద్భుతమైన గుర్తింపు తీసుకువచ్చింది.ఇక ఈ సినిమా మంచి హిట్ కావడంతో అప్పటినుంచి అనసూయ వెండితెర అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ విధంగా ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈమె ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. ఇకపోతే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.అయితే సోషల్ మీడియా వేదికగా ఆమె తనకు సంబంధించిన విషయాల గురించి ఎవరైనా ట్రోలింగ్ చేస్తే మాత్రం వారికి లెఫ్ట్ రైట్ ఇస్తూ రెచ్చిపోతారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం విజయ్ దేవరకొండ అభిమానులకు అనసూయకు మధ్య ట్విట్టర్ వార్ జరుగుతుంది.

ఈమె విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా విడుదల కావడంతో సినిమాని ఉద్దేశించి కామెంట్ చేశారు. అయితే విజయ్ అభిమానులు మాత్రం రెచ్చిపోయి అనసూయను దారుణంగా ట్రోలింగ్ చేస్తూ ఏకంగా ఆంటీ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. ఇలా తనని ఆంటీ అని పిలవడంతో అనసూయ తనని ఆంటీ అన్న వారిపై పోలీస్ కేసు పెడతానని మీరు చేసే ప్రతి ట్వీట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నా దగ్గర ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ వివాదంతో అనసూయకు సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే అనసూయకు అధికారులు వీసా క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తోంది.అయితే అనసూయకు గతంలోనే వీసా క్యాన్సిల్ చేయగా ఆ రహస్యం ప్రస్తుత వివాదం ద్వారా బయటపడిందని తెలుస్తోంది. విదేశాలలో కొన్ని వీరికి సంబంధించిన వ్యాపారాలు ఉండటం వల్ల అధికారులు ఈమెకు వీసా క్యాన్సల్ చేసినట్టు తెలుస్తుంది. అయితే కేవలం అనసూయకు మాత్రమే కాకుండా ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు నటీమణులు యాంకర్లకు సంబంధించిన వీసాలు కూడా క్యాన్సిల్ అయ్యాయని వార్తలు వస్తున్నాయి. మరి అనసూయ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -