Pawan Kalyan: హరిహర వీరమల్లు నిర్మాతలను టెన్షన్ లో పెట్టిన పవన్ కళ్యాణ్?

టాలీవుడ్ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల విశాఖలో జరిగిన పరిణామాలకు నిరసనగా స్టేజ్ మీద ఒక రేంజ్ లో విడుచుకుపడుతూ వైసిపి ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ చెప్పు తీసుకొని కొడతాను అంటూ చెప్పు చేతిలోకి పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. అయితే పవన్ వాక్యాలను వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో పవన్ పై రివర్స్ ఎటాక్ ని మొదలు పెట్టేశారు.

అయితే పవన్ కళ్యాణ్ మాటల ప్రభావం వచ్చే ఏడాది విడుదల కానున్న సినిమాలపై పడుతుంది అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాపై పడుతుందని హరిహర వీరమల్లు సినిమా నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా 2023 వేసవిలో విడుదల విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉండగా మధ్యలో కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.ఇటీవల ఈ షూటింగ్ మొదలు కాగా ఈ లోపు ఈ విధంగా ఊహించని సంఘటనలు జరగడంతో ఆ సినిమా నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు. అయితే గతంలో వకీల్ సాబ్ సినిమా సమయంలో బెనిఫిట్ షోలు కూడా లేకుండా చేసింది జగన్ సర్కార్.

ఇలా బెనిఫిషోలు లేకుండా చేయటంతో భీమ్లా నాయక్ సినిమాకు రెవెన్యూ అధికారులను థియేటర్ల వద్ద కాపలా పెట్టి మరి సినిమా టికెట్లను సాధారణ రేట్లకు అమ్మించారు. దీంతో కొన్ని ఏరియాలో బయ్యర్లకు భీమ్లా నాయక్ సినిమా తీవ్ర నష్టాలను మిగిల్చింది. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా విషయంలో కూడా ఇదే రిపీట్ అవుతుందేమో అని నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -