Lakshmi Parvathi: బాలయ్య, లోకేశ్ లపై లక్ష్మీపార్వతి కామెంట్లు విన్నారా?

Lakshmi Parvathi: తెలుగు రాష్ట్రాలలో నందమూరి కుటుంబం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కుటుంబంలో ప్రతి ఒకరు మీడియా ముందుకు వచ్చినవాళ్లే. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీలో కూడా ఈ కుటుంబం మంచి పేరు సంపాదించుకుంది. అయితే ఈ కుటుంబంకు చెందిన లక్ష్మీపార్వతి కూడా తెలుగు వారితో తన పరిచయాన్ని పెంచుకుంది. ఎన్టీఆర్ రెండో భార్య అయిన ఈమె.. అప్పట్లో ఎన్టీఆర్ కి ఎలా పరిచయమైందో అందరికీ తెలిసిందే.

ఇక ఈమె రాజకీయపరంగా కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఇక ప్రస్తుతం ఈమె వైసీపీ పార్టీలో ఉంది. ఇక ఈమె చాలా వరకు చంద్రబాబు, లోకేష్ లపై బాగా విమర్శలు చేస్తూ ఉంటుంది. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. దానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

 

ఇక అందులో తను చాలా షాకింగ్ కామెంట్లు చేసింది. నారా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ ని వాడుకుంటుందా అని యాంకర్ ప్రశ్నించడంతో.. నారా కుటుంబమే అధికారంలో ఉండాలని అనుకుంటుంది అని షాకింగ్ కామెంట్ చేసింది. ఇక లోకేష్ పాదయాత్ర గురించి మాట్లాడుతూ.. లోకేష్ అనేవాడు కల్ప జంతువు అని కామెంట్ చేసింది.

 

ఇక లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీలోకి ఆహ్వానించడం అనేది నక్క సింహాన్ని పిలిచినట్లుగా ఉందంటూ తెలిపింది. చంద్రబాబు చేస్తున్న మోసం తెలుసు కాబట్టి ఎన్టీఆర్ టీడీపీ కి దూరంగా ఉంటున్నాడు అని కామెంట్ చేసింది. ఇక తనతో కలిసి అన్ స్టాపబుల్ షో చేస్తానని చెప్పేంత ధైర్యం బాలయ్యకు ఉందా అంటూ ప్రశ్నించింది. అంతేకాకుండా సినిమాలో కూడా బాలయ్య తన పాత్రను చూపించలేకపోయారు అని అన్నది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు బాగా వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -