Ram Charan: హీరో రామ్ చరణ్ కు వెన్నుపోటు.. అసలేమైందంటే?

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇకపోతే రామ్ చరణ్ గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా కూడా మారాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ తమిళ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

 

రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమాను నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ని ఇప్పటివరకు విడుదల చేయలేదు.

ఉగాది పండుగ సందర్భంగా లేదంటే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సీఈవో అనే టైటిల్ ని పెట్టబోతున్నట్టు గత రెండు మూడు రోజులుగా వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. సీఈవో అనగా చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్. కాగా తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో టాలీవుడ్ ఒకప్పటి హీరో శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీకాంత్ పాత్ర ఎవరూ ఊహించని విధంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇది ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తుందని కూడా తెలిసింది. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రకు శ్రీకాంత్ రోల్ వెన్నుపోటు పొడిచేదిగా ఉంటుందట. సెకెండాఫ్‌లో వచ్చే ఈ ఎపిసోడ్ మొత్తం పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఉండబోతున్నట్లు సమాచారం ఉండబోటున్నట్లు సమాచారం. అతడు విలన్ అని తెలిసే సన్నివేశాలు ట్విస్ట్ ఇస్తాయని సమాచారం. ఆ సమయంలో శ్రీకాంత్ యాక్టింగ్ అదిరిపోతుందనే టాక్ వినిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -