Naresh: నా జీవితంలో విలన్ ఆమే.. నరేష్ కామెంట్స్ వైరల్!

Naresh: నటుడు నరేష్ పవిత్ర ప్రస్తుతం రిలేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. గత నాలుగు సంవత్సరాలుగా వీరిద్దరూ రిలేషన్ లో కొనసాగుతూ ఉన్నారు. అయితే మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా మే 26వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నరేష్ తన సినిమా గురించి కొన్ని విషయాలు తెలియజేశారు. చాలామంది మేము మా జీవిత కథ ఆధారంగా సినిమా చేసామని భావిస్తున్నారు.నిజానికి మా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా చేయలేదని ప్రస్తుత సమాజంలో వివాహ వ్యవస్థ ఎలాంటి పరిస్థితులలో ఉందో తెలియచేయడానికి ఈ సినిమా చేశామని తెలిపారు. ఇక ఈ సినిమా ఎవరి పైనో రివేంజ్ తీర్చుకోవడం కోసం చేయలేదని తెలిపారు.

 

ఒకవేళ రివేంజ్ తీర్చుకోవాలి అంటే యూట్యూబ్లో కొన్ని వీడియోలు చేస్తే చాలు దానికోసం 15 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదని నరేష్ తెలియజేశారు.నా జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చాయి అందుకే విడాకులు తీసుకున్నాను కానీ ఒక వ్యక్తి మా ఇద్దరిని విడదీయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. తన వల్లే ఈ పరిస్థితి ఎదురైందని నరేష్ తెలియజేశారు. అయితే తన పేరును మాత్రం ఈయన ప్రస్తావించడానికి ఇష్టపడలేదు.

 

ఇక పవిత్ర నన్ను నమ్ముకుని నాతోపాటు వచ్చేసింది. నన్ను నమ్ముకున్న తనకు నేను బ్రతికినంత కాలం తనకు తోడుగా ఉంటానని మాటిస్తున్నాను.ఒకవేళ మేము పెళ్లి చేసుకోవాలి అనుకుంటే అందరినీ పిలిచి ఘనంగా పెళ్లి చేసుకుంటామని ఈ సందర్భంగా నరేష్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈయన మూడో భార్య రమ్య రఘుపతి కారణంగానే వీరికి సమస్యలు వచ్చాయా.. తనే వీరిద్దరిని విడదీయాలని ప్రయత్నించిందా అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -