Mohan Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడి మోహన్ బాబు ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఇండస్ట్రీలో విలన్ గా నటించి తన నటనతో అందరిని మెప్పించడమే కాకుండా అనంతరం హీరోగా కూడా అవకాశాలను అందుకున్నారు. ఇలా హీరోగా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి మోహన్ బాబు ఇక నిర్మాతగా కూడా కొనసాగారు ఇప్పటికీ ఈయన పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు మోహన్ బాబు తన యూనివర్సిటీని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న సంగతి తెలిసిందే..ఇలా వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తన యూనివర్సిటీలో వారి గ్రామస్తులతో కలిసి సుమారు 100 మొక్కలను నాటించారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కులాల గురించి మోహన్ బాబు మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి.
ఈ సందర్భంగా మోహన్ బాబు కులాల గురించి మాట్లాడుతూ అప్పట్లో కులాలు ఉన్నా సరే ప్రతి ఒక్కరు కూడా చాలా ఆప్యాయంగా పిలుచుకునేవారు కులాలు వేరైనా ప్రతి ఒక్కరు అత్త పిన్ని బాబాయ్ అంటూ వరుసలతో ఎంతో ఆత్మీయంగా పిలుచుకునేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు ప్రతి ఒక్కరు కులం పేరుతో దూషిస్తున్నారని మోహన్ బాబు తెలియజేశారు. అసలు ఈ కులాలని ఎవరు కనిపెట్టారంటూ ఈయన ఈ సందర్భంగా మాట్లాడారు.
ఇక చిన్నప్పుడు తాను తన స్నేహితుడిని ఒకరు అంటరాని వాడు అనడంతో నేను చెప్పుతో కొడతాను అంటూ ఆ వ్యక్తిని తిట్టానని ఈ సందర్భంగా ఈయన గుర్తు చేసుకున్నారు.ఇప్పుడు ఇలాంటి కులిపిచ్చి ఎక్కువైందని ఇది వినాశనానికి దారితీస్తుందని అందుకే నాకు కులాలు అంటేఅసహ్యం అంటూ ఈ సందర్భంగా మోహన్ బాబు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.