Mohan Babu: మరోసారి మీడియాపై ఫైర్ అయిన మోహన్ బాబు.. ఏం జరిగిందంటే?

Mohan Babu: టాలీవుడ్ సీనియర్ నటుడు డైలాగ్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మోహన్ బాబు మరోవైపు విద్యాసంస్థలను కూడా నడుపుతూ ఎంతోమందికి బంగారు భవిష్యత్తును అందిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

 

ఈ విధంగా వృత్తిపరమైన జీవితంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మోహన్ బాబు ప్రస్తుతం పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈయన సబ్ రిజిస్టర్ వారి కార్యాలయంలో సందడి చేశారు.మోహన్ బాబు తన ఆస్తులకు సంబంధించిన వీలునామా కోసం సబ్ రిజిస్టర్ వారి కార్యాలయానికి వచ్చినట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే మోహన్ బాబు సబ్ రిజిస్టర్ వారి కార్యాలయానికి రావడంతో మీడియా తనని కవర్ చేయడం మొదలుపెట్టారు.ఇలా మీడియా వారందరూ ఒక్కసారిగా అక్కడికి రావడంతో మోహన్ బాబు పై తీవ్ర స్థాయిలో వారిపై విరుచుకుపడ్డారు. బుద్ధుందా అంటూ నోటికి పని చెప్పారు.ఈ విధంగా మోహన్ బాబు మీడియా పైప్ మండిపడటమే కాకుండా లోగోలు లాక్కొండయ్య అంటూ బౌన్సర్లను పురమాయించారు.

 

మోహన్ బాబు ఇలా చెప్పడంతో బౌన్సర్లు కూడా అత్యుత్సాహం కనబరిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజెన్స్ మోహన్ బాబు వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మీరు ఒకరికి చెప్పే స్థాయిలో ఉండి ఒకరితో చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకోకండి మీరు డైలాగ్ కింగ్ అనేది మాటలు వరకే సరిపోదు చేతులలో కూడా ఉండాలి అంటూ ఈ సందర్భంగా నేటిజన్స్ ఫైర్ అవుతున్నారు ఏమి

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -