Anasuya: బుల్లితెర యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించి అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకొని ప్రస్తుతం అనసూయ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమా అవకాశాలు వెబ్ సిరీస్ లలో నటించే అవకాశాలు రావడంతో ఈమె జబర్దస్త్ కార్యక్రమంలో నుంచి తప్పుకున్నారని వార్తలు వచ్చాయి.అయితే ఈ విషయంపై స్పందించిన అనసూయ తనుకు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి అలాగే ఈ కార్యక్రమంతో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నానని తెలిపారు.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో ఆడవాళ్లకు ముఖ్యంగా హీరోయిన్స్ కు ప్రాధాన్యత చాలా తక్కువ, వాళ్లకు ఎలాంటి ప్రాధాన్యత ఉండదు అంటూ ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు. హీరోయిన్ కెమెరా ముందు నిలబడి కాపాడండి అని అరవడం లేదా సిగ్గుపడుతూ నవ్వాలి ఇదే మా పని అంటూ చెప్పుకొచ్చారు.
ఇంతకు మించి ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఏ మాట మాట్లాడకూడదు.మహేష్ బాబు పోకిరి సినిమాలో గిల్లితే గిల్లిచ్చుకోవాలి అనే డైలాగ్ ఉంది కదా ఇండస్ట్రీలో కూడా హీరోయిన్స్ పరిస్థితి సేమ్ టు సేమ్ అలాగే ఉంటుందని అనసూయ షాకింగ్ కామెంట్స్ చేశారు.మేము మా హక్కుల గురించి మాట్లాడితే మాపై ఇంట్రెస్ట్ పోతుంది హీరోయిన్ ఇండస్ట్రీలో ఒక దేవదాసీలా మాత్రమే పని చేయాలి అంటూ ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇలా హీరోయిన్స్ కిఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లేకుండా ఉందని అయితే ఒక్కసారి కనుక మేము ఆలోచిస్తే థియేటర్ కు ఒక్కరు కూడా వచ్చి సినిమా చూడరంటూ ఈమె కామెంట్ చేశారు. కేవలం మేము ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కోసమే పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు.మీరు థియేటర్ కి వచ్చి సినిమా చూస్తేనే మాకు కూడా పని దొరుకుతుంది అంటూ ఈ సందర్భంగా అనసూయ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.