YS Jagan: అమిత్ షా జగన్ భేటీ వెనుక అసలు రీజన్స్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం మనకు తెలిసిందే . గత మూడు రోజులుగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు.ఇలా ఉన్నఫలంగా జగన్మోహన్ రెడ్డి మూడు రోజులపాటు ఢిల్లీలో మాకం వేయడంతో ఈయన ఢిల్లీ పర్యటన వెనుక ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కార్యక్రమంలో జగన్ పాల్గొన్న విషయం మనకు తెలిసింది.

ఇక జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ పర్యటన వెళ్లిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలవనీదే ఈయన ఢిల్లీ నుంచి వెను తిరగరు.అందుకే అమిత్ షాను కలవడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక జగన్మోహన్ రెడ్డి అమిత్ షా ని ఎప్పుడు ఢిల్లీ వెళ్లిన రాత్రి పది తర్వాత మాత్రమే కలుస్తారని తెలుస్తుంది. ఇలా ఇంత రహస్యంగా జగన్మోహన్ రెడ్డి అమిత్ షాను కలవడానికి గల కారణం ఏంటి అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతూ ఉంటాయి.

 

సాధారణంగా అమిత్ షా ఉదయం నుంచి పార్టీ కార్యకలాపాలు తన అధికారకవ్యవహారాల కారణంతో ఎంతో బిజీగా ఉంటారు. అందుకే ఈయన పగలు ఎవరికి ఎలాంటి అపాయింట్మెంట్స్ ఇవ్వరని తెలుస్తోంది. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం అధికారకంగా కాకుండా వ్యక్తిగతంగా రాత్రి పది గంటల తర్వాత కలవడం పట్ల జగన్ అమిత్ షా బేటి గురించి ప్రతిపక్షాలు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తుంటాయి.

 

కారణం ఏదైనా జగన్మోహన్ రెడ్డి అమిత్ షాక్ కోసం ఇలా పడి కాపులు కాసి తనని అర్ధరాత్రి సమయంలో కలిసి రావడంతో ఈ విషయం ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను కలిగిస్తుంది. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని, ఎంపీలను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాలు, కేసుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు ఈ కారణంగానే వస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Jagan Campaigners For TDP: టీడీపీకి జగన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్.. నమ్మకపోయినా వాస్తవం మాత్రం ఇదే!

Jagan Campaigners For TDP: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయారు. ప్రజలు నమ్మిన నమ్మకపోయినా ఇదే వాస్తవమని తెలుస్తోంది చంద్రబాబు నాయుడు సూపర్...
- Advertisement -
- Advertisement -