Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిరంజీవి తాజాగా నటించిన చిత్రం బోళా శంకర్. ఇందులో తమన్నా హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.. ఈ సినిమాకు మొహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ ను విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి చిరంజీవి లీక్స్ లో భాగంగా చాలా మేకింగ్ వీడియోలు విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఆ వీడియోలను బట్టి చూస్తే ఈ సినిమా సెట్స్ లో చిరంజీవి చాలా సరదాగా ఎంజాయ్ గా విడిపోయారు అని తెలుస్తోంది. తాజాగా సెట్స్ లో జరిగిన మరో సరదా సంఘటనను పంచుకున్నారు మేకర్స్. సెట్స్ లో తమన్నాను తమన్ అని పిలిచేవారంట చిరంజీవి. అలా భోళాశంకర్ సెట్స్ లో నిత్యం తమన్ పేరు వినిపించేదని చెప్పుకొచ్చింది తమన్నా. తమన్ ను ఎవరు పిలిచినా నన్ను పిలిచినట్టు అనిపిస్తుంది. ఆయన పేరు నా పేరు దాదాపు ఒకటే. సెట్స్ లో కూడా చిరంజీవి నన్ను తమన్ అని పిలిచేవారు. అలా మా సెట్స్ లో తమన్ పేరు ఎప్పుడూ వినిపించేది అని చెప్పుకొచ్చింది తమన్నా. కాగా ఇదే విషయాన్ని దర్శకుడు మెహర్ రమేష్ కూడా చెప్పుకొచ్చాడు.
చిరంజీవి ఎప్పుడు తమన్ అని పిలిచినా, అతడు వచ్చాడేమోనని మెహర్ అటువైపు చూసేవాడంట. తీరా చూస్తే అక్కడ తమన్నా ఉండేది. ఇక మిల్కీబ్యూటీ అనే ట్యాగ్ లైన్ పై కూడా స్పందించింది తమన్న. ఆ బిరుదు తనకు ఎలా వచ్చిందో ఇప్పటికీ అర్థం కాలేదన్న తమన్న. కేవలం తన కలర్ చూసి ఆ బిరుదు ఇవ్వలేదని, తనపై ఉన్న ప్రేమను తెలుగు ప్రేక్షకులు అలా చూపించారని అభిప్రాయపడింది.ఈ భోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ కూడా కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.