Upasana-Pranathi: ఉపాసన కొరకు లక్ష్మీ ప్రణతి చేసిన పని తెలిస్తే షాకవ్వాల్సిందే!

Upasana-Pranathi: సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో మనకు తెలిసింది.అయితే వీరిద్దరి మధ్య మాత్రమే కాకుండా వీరి భార్యలు అయినటువంటి ఉపాసన లక్ష్మి ప్రణతి మధ్య కూడా అలాంటి స్నేహబంధమే ఉందని చెప్పాలి. ఉపాసన లక్ష్మీ ప్రణతి కలిసి ఉన్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో పెద్దగా కనిపించకపోయిన వీరిద్దరూ తరచూ కలుస్తూ ఎంతో మంచి స్నేహబంధంతో మెలుగుతూ ఉంటారు.

గత పుట్టినరోజు సందర్భంగా లక్ష్మి ప్రణతి కోసం ఉపాసన ఖరీదైన కానుకలను పంపిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా ఉపాసన ప్రెగ్నెన్సీతో ఉండగా ఉపాసన కోసం లక్ష్మీ ప్రణతి చేసిన పని తెలిసి ప్రస్తుతం అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.కడుపుతో ఉన్నటువంటి మహిళలకు ఎన్నో కోరికలు ఉంటాయి. అలాంటి ఫుడ్ తినాలని ఇలా దుస్తులు వేసుకోవాలని ఎన్నో రకాల కోరికలు ఉంటాయి.

 

ఇలా ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ తెలిసినటువంటి లక్ష్మీ ప్రణతి ఉపాసన కోసం స్పెషల్ గా పిండివంటలను తయారు చేసి పంపించారట. ఉపాసన కోసం ప్రణతి స్వయంగా సున్నుండలు డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఇంకా ఇతర పిండి వంటలను స్వయంగా ఇంట్లో తయారు చేసి ఉపాసన కోసం పంపించారని తెలుస్తోంది. ఇలా ఉపాసన కోసం ఇంత కష్టపడి పిండివంటలు చేస్తూ తన పట్ల ఉన్నటువంటి ప్రేమను లక్ష్మీ ప్రణతి చాటుకున్నారు.

 

ఇక లక్ష్మీ ప్రణతి ఇలా పిండివంటలు పంపించారనే విషయం తెలిసిన రామ్ చరణ్ ఎన్టీఆర్ సైతం ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారట.లక్ష్మీ ప్రణతి చేసిన ఈ పని గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎన్టీఆర్ అభిమానులు రామ్ చరణ్ అభిమానులు వీరిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -