Tollywood Stars: టాలీవుడ్ స్టార్స్ ఏం చదివారో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Tollywood Stars: సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీల గురించి వారి ఫ్యామిలీ గురించి ప్రతి ఒక్క విషయం తెలుసుకోవడానికి చాలా ఆతృత కనబరుస్తూ ఉంటారు.అయితే ఇప్పటివరకు సినిమా హీరోల బ్యాక్గ్రౌండ్ వారి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి మనం చదివే ఉంటాం అయితే మన ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న వారు ఏ హీరో ఎంత వరకు చదువుకున్నారనే విషయం చాలామందికి తెలియదు.ఈ క్రమంలోనే మన టాలీవుడ్ సీనియర్ హీరోల నుంచి మొదలుకొని ఏ హీరో ఎంత వరకు చదువుకున్నారో ఇక్కడ తెలుసుకుందాం…

సీనియర్ ఎన్టీఆర్: ఈయన ఇండస్ట్రీలోకి రాకముందే గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు.

ఏఎన్ఆర్: అక్కినేని నాగేశ్వరరావు 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు.

కృష్ణ: కృష్ణ సినిమాలలోకి రాకముందే ఏలూరులోని సి ఆర్ ఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు.

చిరంజీవి:ఈయన ఇండస్ట్రీలోకి రాకముందు కామర్స్ లో డిగ్రీ పట్టా పొందిన తర్వాత నటనలో ప్రావీణ్యం పొందడం కోసం మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరారు.

బాలకృష్ణ: ఈయన హైదరాబాద్ నైజాం కాలేజీలో డిగ్రీ పట్టా పొందారు.

వెంకటేష్: వెంకటేష్ ది మాంటెరీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నుండి ఎంబిఎ పూర్తి చేసి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

నాగార్జున: బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.

పవన్ కళ్యాణ్: ఇంటర్ రెండుసార్లు ఫెయిల్ అయ్యానని స్వయంగా తెలియజేశారు.

ఎన్టీఆర్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్మీడియట్ పాసయ్యారు.

మహేష్ బాబు: కామర్స్ లో డిగ్రీ పూర్తి చేశారు.

ప్రభాస్: బీటెక్ పూర్తి చేసే ఇండస్ట్రీలోకి వచ్చారు.

రానా: రానా బి.కామ్‌లో చేరి, ఆ తరువాత చెన్నై ఫిల్మ్ స్కూల్‌ లో ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీలో పట్టా పొందారు..

అల్లు అర్జున్: బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో డిగ్రీ పట్టా అందుకున్నారు.

నాగచైతన్య: బీకాం డిగ్రీ పట్టా అందుకున్నారు..

రామ్ చరణ్: లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో డిగ్రీ చేసాడు.

నితిన్: బీటెక్ పూర్తి చేశారు

రాజమౌళి: ఇంటర్ ఫెయిల్ అయ్యారు

అఖిల్: అఖిల్ అమెరికాలో థియేటర్ ఆర్ట్స్‌లో డిగ్రీ పట్టా పొందారు.

నాని: హైదరాబాదులోని వెస్లీ కాలేజ్ లో డిగ్రీ పొందారు.

అడివి శేష్: శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్శిటీలో చదువుకున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -