Ghosts: మనిషికి నిద్ర అన్నది చాలా అవసరం. అయితే మామూలుగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు సరిపడ నిద్ర కూడా అవసరం. అలాగే మనం చేసే కొన్ని కొన్ని తప్పులు కూడా తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చు. దాహాన్ని కూడా అస్సలు ఆపుకోకూడదు. ఏ వేగాన్ని కూడా బలవంతంగా ఆపకూడదు. అప్పుడు అనారోగ్య సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. చాలామంది బారెడు పొద్దెక్కినా కూడా లేయకుండా ఉదయం 9 గంటలకు నిద్ర లేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు.
ప్రతి రోజు సూర్యభగవానుడుని ఉదయం 4:30 నుండి 6:00 లోగా పూజించడం మంచిది. ఈ సమయమే శ్రీరాముడికి, వెంకటేశ్వర స్వామికి కూడా ఇష్టం. ఉదయం 6:00 నుండి 7:30 వరకు శివుడిని, దుర్గాదేవిని కొలిస్తే చక్కటి ఫలితం కనబడుతుంది. మంచి జరుగుతుంది. పుణ్యం కూడా లభిస్తుంది . మధ్యాహ్నం 12 గంటలకి ఆంజనేయ స్వామిని పూజిస్తే, ఆంజనేయస్వామి కృపకు మరింత పాత్రులు కాగలరు. రాహువుని సాయంత్రం మూడు గంటలకి పూజిస్తే చక్కటి ఫలితం పొందవచ్చు. సాయంత్రం సమయంలో శివుడిని పూజిస్తే మంచిది. లక్ష్మీదేవిని సాయంత్రం 6 నుండి రాత్రి 9 వరకు పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. తెల్లవారు జామున మూడు గంటలకి మహావిష్ణువుని పూజిస్తే వైకుంఠ వాసుడి దయ మీకు లభిస్తుంది.
పెద్దలు ఎడమవైపుకు తిరిగి పడుకుంటే మంచిది. పెద్దల మాటల్లో ఎంతో ఆరోగ్య సత్యం కూడా ఉంటుంది. ఆకలి వేసినప్పుడు నీళ్లు తాగకూడదు. తల భాగము శరీరభాగం కంటే దిగువలో ఉంచుకుని నిద్రించకూడదు. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. లేదంటే రకరకాల సమస్యలు కలుగుతాయి. నిద్రపోవడానికి కూడా నియమాలు ఉన్నాయి. పడుకునే టప్పుడు కుడి వైపుకి తిరిగి నిద్రపోతే పిశాచాలు ఆవహిస్తాయి. కాబట్టి ఎడమ వైపుకే తిరిగి నిద్రపోండి. ఎప్పుడూ కుడి వైపుకి తిరిగి నిద్రపోవద్దు. కుడివైపుకి తిరిగి నిద్రపోతే పీడ కలలు, కలత నిద్ర వస్తాయి. తిన్న ఆహారం జీర్ణం అవ్వాలంటే ఎడమ వైపుకి తిరిగి నిద్రపోతే మంచిది. దాహం వేసినప్పుడు అస్సలు ఆహారాన్ని తినకూడదు.