Balayya: ఆ వ్యక్తి వల్లే బాలయ్య కెరీర్ లో నష్టపోతున్నారా?

Balayya: సినిమా ఇండస్ట్రీలో కొన్ని మూవీస్ లోని డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అయితే కొందరు హీరోలు చెప్పే డైలాగులు మాత్రం కొన్ని చర్చలకు దారితీస్తాయి. ప్రస్తుతం అలాంటిదే జరిగింది. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే విడుదలైంది. ఈ సినిమాకు బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ రాశారు.

 

ఒక్క సినిమాకు కోటి రూపాయల రెమ్యూనిరేషన్ తీసుకుంటున్న ఆయనకు మంచి మార్కెట్ ఉంది. తాజాగా ఆయన ఓ విషయం మర్చిపోయి డైలాగులు రాశారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. వీర సింహా రెడ్డి సినిమాలో పొలిటికల్ డైలాగులు లేకపోయినా వచ్చిన నష్టం లేదని, అయితే ఇందులో కావాలనే కొన్ని పొలిటికల్ డైలాగులు వచ్చాయని మరికొందరు అంటున్నారు. సినిమాలో విషయం వుంటే బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించక తప్పదు. పైగా హీరో బాలకృష్ణ కూడా తన సినిమాలో కాంటెంపరరీ పొలిటికల్ డైలాగులు రాయండని చెప్పే రకం కానే కాదు. గోపీచంద్ మలినేని కూడా అలాంటి డైలాగులు రాయమని అస్సలు చెప్పుండరని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

 

బాలకృష్ణ ఫ్యాన్స్ అంటే తెలుగుదేశం అభిమానులే అయ్యుంటారేమోనని అనుకున్నారో ఏమో గానీ బుర్రా తన పదునైన పొలిటికల్ డైలాగులు సినిమాలో చొప్పించారని తెలుస్తోంది. సంతకం డైలాగు, డిఎన్ఎ డైలాగు ఇప్పటికే ట్రయిలర్ లో సందడి చేస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో యాంటీ టీడీపీ జనాలు భారీగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

ఒక్క సంతకమే ఎన్టీఆర్ పేరును ఓ జిల్లాకు పెట్టిందని, అలాంటి సంతకమే బాలయ్యను కాపాడిందని, ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ బుర్రాకు కౌంటర్ ఇస్తున్నారు. అక్కడితో ఆగకుండా డిఎన్ఎ దగ్గరకు వెళ్లే సరికి మరీ బిలో ది బెల్ట్ అటాక్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య ఇంట్లో కాల్పుల టైమ్ లో వచ్చిన వార్తల కటింగ్ లు అన్నీ బయటకు తీసి మరీ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. గతంలో బాలయ్య సినిమాల్లో పరుచూరి బ్రదర్స్ పవర్ ఫుల్ డైలాగులు రాయగా అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి కాస్త తెలియలేదు. కానీ ఇప్పుడు డైలాగులకు వచ్చినంత విమర్శలు ఇది వరకూ ఎప్పుడూ రాలేదంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -