Balayya: ఎన్టీఆర్ పై బాలయ్య కోపగించుకోవడానికి అసలు కారణమిదా?

Balayya: నందమూరి హీరో బాలకృష్ణకు ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది అభిమానులు. వయసుతో సంబంధం లేకుండా ఏ హీరోకి అయినా అభిమానులు ఉన్నారు అంటే అది కేవలం బాలయ్య బాబు అని చెప్పవచ్చు. ఇకపోతే బాలయ్య బాబుకి కోపం ఎక్కువ అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే గతంలో పలుసార్లు తన కోపాన్ని ప్రదర్శించారు బాలయ్య బాబు. అంతే కాకుండా అభిమానుల పై చేయి కూడా చేసుకున్నాడు. కానీ అభిమానులు మాత్రం ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు.

 

ఎందుకంటే బాలయ్య బాబు మనసు బంగారం అని చెబుతూ ఉంటారు. కోపం వచ్చినపుడు తనను తాను కంట్రోల్ చేసుకోలేడు బాలయ్య. అందుకే దేవుడిగా చూసే నాన్నగారితో కూడా ఓసారి గొడవ పడ్డాడు. ఏంటి సీనియర్ ఎన్టీఆర్ తో బాలకృష్ణ గొడవపడ్డారా అంటే అవునని చెప్పవచ్చు. ఇదే విషయాన్నీ అన్‌ స్టాపబుల్ ఎపిసోడ్‌లో భాగంగా ఈ ముచ్చట్లు పంచుకోవడం విశేషం. అన్ స్టాపబుల్ షోలో రాజమౌళి కీరవాణి పాల్గొన్న విషయం తెలిసిందే. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఆహాలో అత్యధిక వ్యూస్ తీసుకొస్తున్న షోగా ఈ షో రికార్డులు తిరగరాస్తోంది. పైగా బాలయ్య హోస్టింగ్ కావడంతో మరిన్ని రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. షో కి వచ్చిన గెస్ట్ లను నవ్వుతూనే కాంట్రవర్సీ విషయాలను కూడా బయటికి లాగుతున్నాడు..

బాలయ్య బాబు జక్కన్నతో తనతో సినిమా సినిమా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించాడు బాలయ్య. ఆ టాపిక్ ఎక్కడెక్కడికో వెళ్లి చివరికి ఎన్టీఆర్ దగ్గర ఆగింది. దాంతో నాన్నగారి గురించి చెప్పడం మొదలు పెట్టాడు బాలకృష్ణ. ఈ క్రమంలోనే సామ్రాట్ అశోక సినిమా సంగతులు చెప్పుకొచ్చాడు. ఆ సినిమాను తానే డైరెక్ట్ చేయాలనుకున్నానని. స్క్రిప్ట్ కూడా రెడీ అయిన తర్వాత తనకు కావాల్సినవన్నీ నాన్నగారిని అడగడం మొదలుపెట్టానని, ఎందుకంటే ఆ సినిమాకు నిర్మాత కూడా ఆయనే కాబట్టి సినిమాను 70 ఎంఎంలో చేద్దామండి అంటే కాదన్నాడని క్లైమాక్స్‌కు 10 వేల మంది కావాలంటే హా ఇంకా అంటూ వెటకారం చేసాడని గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత 2000 గుర్రాలు 200 ఒంటెలు కూడా కావాలండీ అంటే తనను చూసి నవ్వేసాడని చెప్పుకొచ్చాడు. దాంతో తనకు కోపం వచ్చి స్క్రిప్ట్ నేలకేసి కొట్టి తాను సినిమా చేయడం లేదంటూ వచ్చేసానని తెలిపాడు బాలయ్య. ఆ తర్వాత సామ్రాట్ అశోకను ఎన్టీఆర్ డైరెక్ట్ చేసుకున్నాడు. కానీ ఫలితం మాత్రం డిజాస్టర్ చెప్పుకొచ్చాడు బాలకృష్ణ.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -