Star Heroes: ఈ ముగ్గురు స్టార్ హీరోలలో బాక్సాఫీస్ రికార్డులు మార్చేది అతనేనా?

Star Heroes: ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు అందరూ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తుండగా, బాలకృష్ణ భగవత్ కేసరి సినిమాలో నటిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో బ్రో సినిమా తెరకెక్కబోతోంది. అయితే ఈ మూడు సినిమాలలో ఏ సినిమా సూపర్ హిట్ గా నిలవనుంది. ఏ హీరో ప్రేక్షకులను మెప్పించనున్నారు అన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ముగ్గురు సీనియ‌ర్ స్టార్ హీరోల బాల‌య్య‌, చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తోన్న మూడు సినిమాల టీజ‌ర్లు విడుదల అయ్యాయి.

బాల‌య్య భ‌గ‌వత్ కేస‌రి, చిరంజీవి భోళాశంక‌ర్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్,సాయిధ‌ర‌మ్ తేజ్ బ్రో సినిమాలు త్వ‌ర‌లోనే రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఈ మూడు సినిమాల టీజ‌ర్లు అయితే బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి.

ఈ మూడు సినిమాల్లో మెగా హీరోలు చిరు, ప‌వ‌న్ న‌టిస్తోన్న రెండు సినిమాలు కూడా రీమేక్ సినిమాలే. బాల‌య్య సినిమా మాత్ర‌మే డైరెక్టుగా వ‌స్తోంది. ఈ మూడు సినిమాల టీజ‌ర్ల‌లో బాల‌య్య సినిమా టీజ‌ర్ ఆద్యంతం ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంది. బాల‌య్య చెప్పిన డైలాగుల‌తో పాటు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా బాల‌య్య‌ను టీజ‌ర్‌లో చూపించిన తీరు బాల‌య్య ఏజ్‌కు త‌గిన పాత్ర‌, ఆ స్టైల్ అంతా అదిరిపోయింది, ఇక సెకండ్ ప్లేస్‌లో ప‌వ‌న్,సాయిధ‌ర‌మ్ బ్రో సినిమా టీజ‌ర్ ఉంది.

 

బ్రో సినిమాలో ప‌వ‌న్ చేసిన కామెడీ, ఆ డైలాగులు బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ సెట్ అయ్యాయి. అయితే బాల‌య్య టీజ‌ర్ త‌ర్వాత ప్లేసులో నే బ్రో టీజ‌ర్ ఉంద‌ని చెప్పవచ్చు. ఇక ఈ లిస్టులో మూడో ప్లేసులో అట్ట‌డుగున ఉంది చిరు భోళాశంక‌ర్ టీజ‌ర్‌. టీజ‌ర్లో డైలాగులు, చిరు స్టైల్ ఏ మాత్రం కొత్త‌గా లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అస‌లు మెగా వీరాభిమానుల‌కే ఈ టీజ‌ర్ న‌చ్చ‌డం లేదు. చిరు స్టైల్‌, క‌థ‌, సీన్లు అన్నీ కూడా ఎప్పుడో బూజుప‌ట్టిన‌ట్టుగా ఉన్నాయంటున్నారు. ఏదేమైనా ఈ మూడు సినిమాల టీజ‌ర్ల‌లో బాల‌య్య సినిమా టీజ‌ర్ మాత్రం చాలా హైలెట్‌గా నిలిచింద‌ని ఫ‌స్ట్ మార్కులు అన్నీ దానికే ప‌డ్డాయ‌ని చెప్పాలి. అంతేకాకుండా ఈ ముగ్గురు సీరియల్ లో బాలయ్య బాబు నటించిన భగవత్ కేసరి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -