అంతవరకు ఏ నాయకుడికి కూడా మినహాయింపు ఉండదు. అయితే వచ్చే ఏడాది ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి తపనపడుతూ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు బాబు. అందులో భాగంగానే తాజాగా బీసీలతో ఒక సభ పెట్టారు. ఇలాంటి సభలో బీసీలను ఉద్ధరించేస్తాననే మాటలు చెప్పడం సహజం. అలాగే పీ4 అంటూ తానొక కొత్త తారకమంత్రం కనుక్కున్నాడు.ఇప్పుడు ఆ విషయం డప్పు కొట్టుకోవడం కూడా సహజం. కానీ చంద్రబాబు మాటలన్నీ కూడా అచ్చం పవన్ స్క్రిప్టు లాగా సాగిపోయాయి. ఎందుకంటె పవన్ తన ప్రతి ప్రసంగంలో తనకు తెలిసిన కులాల పేర్లన్నీ కాగితంలో రాసుకుని ఆ పేర్లను జాగ్రత్తగా చదివి ఆ కులాలు అన్నింటికీ రాజ్యాధికారం ఇచ్చేస్తాను.
మీ ఒక్క కులం ముఖ్యమంత్రి అయితే చాలా అంటూ రంకెలు వేస్తుంటారు. అయితే బాబు పవన్ లాగే మాట్లాడుతున్నప్పటికీ రాష్ట్రంలోని అన్ని కులాల వారికి జనాభా ప్రాతిపదికన ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం కల్పిస్తాం అని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఏదో ఆవేశంగా మాట్లాడినప్పటికీ బాబు మాత్రం తెలివిగా ఆలోచించి మాట్లాడుతున్నారు మొత్తంగా చూసుకుంటే కులాల దామాషాల్లో నేలబారు మాటలతో ప్రజలను వంచించడానికి పూనుకోవడంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ ఒకే తీరుగా వ్యవహరిస్తున్నారన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది.