Prabhas: ‘బ్రహ్మాస్త్ర’లో ప్రభాస్.. ఈ వార్తలో నిజమెంతా?

Prabhas: బాలీవుడ్ సెలబ్రిటీ జంట రణ్‌బీర్ కపూర్-అలియాభట్ నటించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’. ఇటీవల విడుదలైన ఈ సినిమా కమర్షియల్ హిట్ అందుకుంది. ఓ మాదిరిగా ప్రేక్షకులను అలరించింది. సినిమా స్టోరీలో మొత్తం సస్పెన్స్ ఉండటంతో పార్ట్-2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు. పార్ట్-1 అలరించకపోయినా..

 

 

పార్ట్-2 బాగుటుందేమోనని భావిస్తున్నారు. అయితే పార్ట్-1 చివర్లో రణ్‌బీర్ కపూర్ తండ్రి దేవ్ బ్రహ్మాస్త్రాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చూపించారు. దాన్ని రణ్‌బీర్ కపూర్ ఎలా అడ్డుకుంటాడో అనే విషయాన్ని సస్పెన్స్ గా వదిలేశారు. అయితే దేవ్ పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండబోతుంది. ఈ పాత్రలో ఎవరు నటించబోతున్నాని ప్రస్తుతం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

 

 

 

దేవ్ పాత్రలో స్టార్ హీరో హృతిక్ రోషన్ కనిపించనున్నట్లు మొదట్లో ప్రచారం జరిగింది. దీంతో అటు రణ్‌బీర్ ఫ్యాన్స్ ఇటు హృతిక్ రోషన్ ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. కానీ దాని తర్వాత రణ్‌వీర్ సింగ్ పేరు వినిపించింది. కానీ అది పుకారుగానే మిగిలిపోయింది. ఆ తర్వాత కేజీఎఫ్ హీరో యష్ పేరు ముందుకు వచ్చింది. కరణ్ జోహార్ యష్‌ను కూడా సంప్రదించినట్లు ప్రచారం జరిగింది.

 

 

 

కానీ అది కూడా పుకారుగానే మిగిలింది. ఆ తర్వాత లైగర్ ఫేమ్ విజయ్ దేవరకొండ ‘దేవ్’ పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అలా అందరూ సెలబ్రిటీల పేరు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చారు.

 

వాస్తవానికి బ్రహ్మాస్త్ర సెకండ్ పార్ట్ షూటింగ్ చాలా వరకు పూర్తయింది. కేవలం దేవ్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయట. అయితే దేవ్ పాత్రలో ఎవర్నీ తీసుకోవాలనే విషయంపై దర్శకుడు అయాన్ ముఖర్జీ ఓ క్లారిటీతో ఉన్నాడట. సోషల్ మీడియాలో హీరోల పేర్లు వినిపించినప్పుడు కొత్త కోణాన్ని ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

దేవ్ పాత్ర కోసం ‘హృతిక్ రోషన్, రణ్‌వీర్ సింగ్, యష్, విజయ్ దేవరకొండ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. మరికొద్ది రోజులైతే ప్రభాస్ పేరు వినిపించినా ఆశ్చరపోనక్కర్లేదని డైరెక్టర్ అయాన్ తెలిపారు. దేవ్ పాత్ర కోసం ఇప్పటివరకు ఎవరినీ ఎంపిక చేయలేదు. ఎంపిక చేసిన తర్వాతే మేమే పేరును ప్రకటిస్తామని అయాన్ ముఖర్జీ తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -