పఠాన్ సినిమా ఏ రేంజ్లో పాజివిట్ టాక్ తెచ్చుకుందో అందరం చూశాం. మెుదట కాంట్రవర్సీలకు కేరాఫ్గా మారిన ఈ మూవీ రిలీజ్ తర్వాత ఆ నోళ్లన్నిటినీ మూత పెట్టేసింది. ఈ సినిమా కథలో సుమారు 75 శాతం హీరో షార్ ఖాన్ ఉన్నారు. మిగిలిన భాగం మాత్రమే ఇతర యాక్టర్లు ఉన్నారు. ఇదంతా పక్కకు పెడితే ఆ సినిమా అంతర్జాతీయ స్థాయిలో వందల కోట్ల వసూళ్లు చేసింది.
అయితే ఐఎండీబీ సర్వే తాజాగా సినిమాలు, వెబ్ సిరీస్లపై ఓ సర్వే చెపట్టింది. ఇందులో ఐఎండీబీ వీక్లీ ఇండియన్ పాపులర్ సెలబ్రిటీస్ అనే ఫీచర్ను ప్రవేశపెట్టింది. అందులో రాశిఖన్నా టాపర్గా వచ్చింది. షార్ఖాన్ మాత్రం రన్నరప్గానే నిలిచాడు. మూడో ప్లేస్లో విజయ్ సేతుపతి ఉన్నాడు. ఇక తెలుగు నుంచి ఏ యాక్టర్ టాప్ టెన్లో కనిపించలేదు. దీంతో అంతా షాక్కు గురి అవుతున్నారు. ఇదేం సర్వేరా నాయనా, ఆమెకు ఇంత క్రేజ్ ఉందా అని ముక్కును వేలు వేసుకుంటున్నారు. అలా ఉంటుంది మరీ రాశి ఖన్నా అంటే అని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.