Balayya: ఆ హీరోయిన్ బాలయ్యను నిలువునా ముంచేసిందా?

Balayya: టాలీవుడ్‌ సినిమాల రిలీజ్‌కు సంక్రాంతి పండుగ ఒక సెంటిమెంట్ లాంటింది. స్టార్ హీరోల సినిమాలతోపాటు యంగ్ హీరోల మూవీస్ సంక్రాంతికి విడుదల చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. చాలా వరకు సినిమాలు సంక్రాంతికి విడుదలై హిట్ కొట్టాయి. ప్రస్తుతం ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి పండుగకే రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాల విడుదల కోసం ప్రేక్షకులు కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టార్ సీనియర్ హీరోలు చిరంజీవి-బాలకృష్ణ మరోసారి సంక్రాంతి బరిలో దిగారు. దాదాపు సినీ ఇండస్ట్రీలో మూడున్నర దశాబ్దాలుగా కొనసాగుతూ.. ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు. సంక్రాంతికి బాలయ్య ‘వీరసింహారెడ్డి’, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారు. అయితే ఈ ఇద్దరు హీరోలకు సంక్రాంతి పండుగకు మధ్య.. హీరోయిన్ సెంటిమెంట్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

 

చిరంజీవి – బాలయ్య సంబంధించిన సినిమాలు సంక్రాంతికి విడుదల అయ్యాయి. అయితే సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో ఒకే హీరోయిన్ నటించడం విశేషం. అలా సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్‌లో రిలీజ్ అయి.. ఒకరికి హిట్‌ను అందివ్వగా.. మరొక హీరోకి ప్లాప్‌ని అంటగట్టాయి. ప్రస్తుతం అదే సీన్ రిపీట్ అయింది. గతంలో చిరంజీవి హీరోగా నటించిన సినిమా ‘మంచి దొంగ’. బాలయ్య నటించిన ‘ఇన్‌స్పెక్టర్ ప్రతాప్’ సినిమాలు సంక్రాంతి బరిలో దిగాయి. ఈ రెండు సినిమాల్లో విజయశాంతి హీరోయిన్‌గా నటించింది. అప్పుడు చిరంజీవి ‘మంచిదొంగ’ సినిమా హిట్ కొడితే.. బాలయ్య సినిమా మాత్రం బోల్తా కొట్టింది.

 

 

ఆ తర్వాత చిరంజీవి ‘మృగరాజు’, బాలయ్య ‘నరసింహనాయుడు’ సినిమాలు చేశారు. ఇందులోనూ హీరోయిన్‌గా సిమ్రాన్ నటించింది. ఈ పోటీలో బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి బరిలోకి దిగనున్నారు. మూడోసారి కూడా వీరిద్దరూ కలిసి ఒకే హీరోయిన్‌తో సినిమాలో నటించి సంక్రాంతి బరిలో దిగనున్నారు. వీరసింహారెడ్డి-వాల్తేరు వీరయ్య సినిమాల్లో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిదే. అయితే శ్రుతిహాసన్ ఏ హీరోకి అదృష్టంగా మారుతుందోనని పలువురు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఆ విషయం తేలాలంటే.. సంక్రాంతి వరకు వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -