Allu Arjun: టాలీవుడ్ సెలబ్రిటీలు అటు సినిమాలు చేయడంతో పాటు ఇటు వ్యాపార రంగంలోకి కూడా అడుగు పెడుతున్నారు. సినీ హీరోలకు వ్యాపారాలు చేయడం కొత్తేమీ కాదు. ప్రస్తుతం టాలీవుడ్ లో చాాలా మంది స్టార్ హీరోలు ఇతర వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారు. అలా బిజినెస్ లో రాణిస్తున్నవారిలో మహేష్ బాబు, రామ్ చరణ్, రానా, విజయ్ దేవరకొండ వంటి హీరోలు ఉన్నారు. ఇప్పుడు వారి సరసన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరారు.
అల్లు అర్జున్ గతంలో మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఏషియన్ మల్టీప్లెక్స్ కు సంబంధించి ఆయన పార్ట్ నర్ గా కూడా ఉన్నారు. ఇకపోతే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే విధంగా చేతిలో నాలుగు డబ్బులు ఉండగానే అన్నీ చూసుకోవాలని సెలబ్రిటీలు అనుకుంటున్నారు. అందులో భాగంగా సినిమా వాళ్లంతా పార్ట్ టైమ్ వ్యాపారాలు చేసుకొంటూ రెండు చేతులా డబ్బులు పొందుతున్నారు.
హీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్ కూడా ఓ జిమ్ ఓనర్ గా ఉన్నారు. అలాగే రామ్ చరణ్ కూడా విమానయాన సంస్థకు ఓనర్ గా ఉన్నారు. హీరో శర్వానంద్కి కూడా ఓ కాఫీ షాప్ ఉంది. మహేష్ బాబు అయితే అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. రెస్టారెంట్ వ్యాపారంలో రాణిస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా మహేష్ బాబును ఫాలో అవుతూ రెస్టారెంట్ వ్యాపారంలోకి వెళ్లనున్నారు.
గతంలో కూడా ‘800 జూబిలీ’ అనే పేరుతో నైట్ క్లబ్ కు బన్నీ పార్ట్ నర్ గా ఉన్నారు. బన్నీ బ్రాండ్ తోడుంటే బాగుంటుంది అనుకొన్న 800 జూబిలీ సంస్థ బన్నీతో ఆ వ్యాపారానికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకుని దానిని నిర్వహిస్తోంది. తాజాగా బన్నీ రెస్టారెంట్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వాలని గట్టిగానే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.