Rahul Gandhi: రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టు లో కూడా ఎదురుదెబ్బ తప్పలేదు. రాజకీయ విమర్శలకు పరువు నష్టం కేసులో కింది కోర్టు విధించిన రెండేళ్ల జైల శిక్షను గుజరాత్ హైకోర్టు కూడా సమర్థించింది. ఇందుకు రాహుల్ గాంధీ వెనుక ఉన్న కేసుల రికార్డును కారణంగా చూపించింది. రాహుల్ గాంధీపై దాదాపు 10కిపైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం దోషిగా తేలిన కేసు తర్వాత కూడా పలు కేసులు దాఖలలు అయ్యాయి. వీర్ సావర్కర్ మనవడు కూడా కేసు వేశారు. ఏదిఏమైనా మోదీ ఇంటి పేరు వివాదంలో పడిన శిక్షతో రాహుల్ గాంధీకి అన్యాయం జరిగింది అనడానికి ఏం లేదు! ఈ తీర్పు సరైనదే.
సూరత్ కోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అని గుజరాత్ హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. దీంతో రాహుల్ గాంధీపై పడిన అనర్హతా వేటు కొనసాగుతుంది. అంతే కాదు మరో ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు. ఆయనకు ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే ఒకే ఒక్క అవకాశం ఉంది. అక్కడ కూడా రాహుల్ గాంధీ ఈ శిక్షకు అర్హుడే ఆయన చేసినంతటి నేరం దేశంలో ఇంకెవరూ చేయలేదని నమ్మితే శిక్షను ఖరారు చేస్తారు. ఈ లోపు ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు. కాగా సుప్రీం కోర్టులో ఊరట లభించకపోతతే జైలుకు పోయి రెండేళ్లలు గడపాల్సి ఉంటుంది.
పరువు నష్టం కేసులో జైలుకు వెళ్లిన ప్రధాని పదవికి పోటీ పడే నేతగా చరిత్రకెక్కుతారు. రెండేళ్ల పాటు జైల్లో ఉండి. విడుదలైన తర్వాత ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయాడనికి అనర్హులు అవుతారు. దేశం కోసం గాంధీల కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని చెప్పుకుంటారు కానీ,ఇప్పుడు ఆ గాంధీల కుటుంబం నుంచి ఒకరు పరువు నష్టం కేసులో జైలుకె్ళ్లడం మాత్రం విచిత్రమే.