Lakshmi Pranathi: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండగ మొన్ననే ఘనంగా ముగిసింది. ఆ సమయంలో ఎంత దూరంలో ఉన్నప్పటికీ అన్నా చెల్లెలు కలిసి ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండగకి రాజు పేద అనే భేదం లేకుండా ప్రతి వర్గానికి చెందిన వాళ్ళు రాఖీని సెలబ్రేట్ చేసుకుంటారు. దీనికి సినిమా వాళ్ళు సైతం అతీతులు కారు. అయితే అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్లు అంటే రక్తసంబంధం ఉన్న వాళ్ళు మాత్రమే కాదు..
స్నేహబంధం లో కూడా రక్తసంబంధం ఉంటుంది అని నిరూపిస్తారు కొందరు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చెప్పుకోవాల్సింది అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ స్నేహం గురించి.వాళ్ళిద్దరూ ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది మనకి ఎప్పటినుంచో తెలుసు. ఇద్దరూ బావా, బావా అనుకుంటూ ఎప్పటికప్పుడు ట్వీట్లు పెట్టుకుంటూ ఉంటారు. మొన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు కూడా..
జూనియర్ ఎన్టీఆర్ కంగ్రాట్స్ బావ అంటూ పెట్టిన ట్వీట్ వైరల్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. కేవలం వాళ్ళు మాత్రమే కాదు వాళ్ళు కుటుంబాలు కూడా మంచి స్నేహితులు. ఈ సందర్భంగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి మరీ రాఖి కట్టిన విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. నిజమేనండి ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి స్వయంగా అల్లు అర్జున్ ఇంటికి రాఖీ కట్టడానికి వెళ్లి వాళ్లకి సర్ప్రైజ్ ఇచ్చిందంట.
అయితే చెల్లెలి అభిమానానికి సంతోషించిన అల్లు అర్జున్ ఆమె ని తిరిగి సర్ప్రైజ్ చేస్తూ ఖరీదైన డైమండ్ వాచ్ గిఫ్ట్ గా ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నట్లు తెలుస్తుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కి అల్లు అర్జున్ తోనే కాకుండా అటు రాంచరణ్ తో కూడా మంచి అనుబంధం కొనసాగుతూ ఉంది. ఉపాసన, లక్ష్మీ ప్రణతి కూడా చాలా మంచి ఫ్రెండ్స్. అలాగే స్నేహ రెడ్డి కూడా జూనియర్ ఎన్టీఆర్ కి రాఖీ కట్టిన సంగతి తెలిసిందే.