Keethy Suresh: కీర్తి సురేష్ ఊర మాస్ లుక్.. హీరోయిన్లకు కూడా మసి పూసేస్తున్నారుగా?

Keethy Suresh: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘దసరా’. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నాడు. హీరోయిన్‌గా మహానటి సినిమా ఫేమ్, స్టార్ హీరోయిన్ కీర్తీ సురేశ్ నటిస్తున్నారు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి హీరో నాని ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ పోస్టర్‌లో హీరో నాని లుక్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అలాగే ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ అనే పాటను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. తాజాగా నటి కీర్తి సురేశ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

కీర్తి సురేశ్ పుట్టిన రోజు సందర్భంగా నేడు ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ఫోటోను చూస్తే కీర్తి సురేశ్ ఊర మాస్ లుక్‌లో కనిపిస్తోంది. పెళ్లి బరాత్‌లో పెళ్లి కూతురు డ్రెస్‌లో డ్యాన్స్ చేస్తున్నట్లు ఉంది. పక్కా తెలంగాణ పల్లెటూరి అమ్మాయిలా కనిపిస్తూ ఎంతో సంతోషంగా డ్యాన్స్ చేస్తూ కనిపిస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేశ్ ‘వెన్నెల’ పాత్రలో అలరించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సినిమాను చిత్రీకరిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు వెర్షన్‌తోపాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో చిత్రీకరిస్తున్నారు. 2023 మార్చి 30న థియేటర్లలో విడుదల కానుంది. కాగా, గతంలో హీరో నాని-కీర్తి సురేశ్ కాంబినేషన్‌లో ‘నేను లోకల్’ సినిమా వచ్చింది. 2017లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. దసరా సినిమాలో ఈ జోడి మరోసారి హిట్ రిపీట్ చేస్తుందేమో వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -