Kiara Advani: బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ గురించి తెలుగు ప్రేక్షకులకూ కూడా పరిచయమే. తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించింది కియారా. రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రంలోనూ, మహేష్బాబు సరసన ముఖ్యమంత్రి గర్ల్ఫ్రెండ్గా భరత్ అనే నేను చిత్రంలోనూ నటించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం బాలీవుడ్లో రాణిస్తోంది.
ప్రస్తుతం సిద్ధార్థ మల్హోత్రాతో ప్రేమలో ఉంది కియారా అద్వానీ. ఈ క్రమంలో ఫుల్ జోష్ మీద ఉంది కియారా. వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది ఆమె కెరీర్. గతంలోనూ బాలీవుడ్లోనే తన కెరీర్ను ప్రారంభించిన కియారా.. తర్వాత అనుకున్నంత గుర్తింపు లభించకపోవడంతో కెరీర్ కాస్త డల్ అయ్యింది. అయితే, తెలుగులో వచ్చిన భరత్ అనే నేను చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తర్వాత కెరీర్ సక్సెస్ ట్రాక్ ఎక్కినట్లయింది.
అయితే, రామ్ చరణ్ సరసన నటించిన వినయ విధేయ రామ చిత్రం మాత్రం నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో మళ్లీ బాలీవుడ్కు పయనమైంది కియారా. మళ్లీ రామ్ చరణ్తో హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉంది. అందుకే RC15లో హీరోయిన్గా చేస్తోంది కియారా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇందులో కాస్త కొత్త విషయాలు కూడా పంచుకుంది కియారా.
అతడంటే చాలా ఇష్టం..
తాను చిన్నప్పుడు ఇంట్లో వారికి అత్యధికంగా గౌరవం ఇచ్చేదాన్నని కియారా తెలిపింది. అందుకే వారి విషయంలో ఎమోషనల్గా ఉంటానంది. చిన్నప్పుడు జరిగిన ఓ ఘటనను గుర్తు చేసుకుంటూ.. అప్పట్లో ఓ వ్యక్తిని ఇష్టపడ్డానని, ఆ అబ్బాయితో చాలా సన్నిహితంగా మెలిగేదాన్నని చెప్పింది. అతనంటే మంచి బాండింగ్ ఏర్పడిందని తెలిపింది. అయితే దీన్ని గమనించిన ఇంట్లో పెద్దలు అతనితో మాట్లాడకుండా అడ్డుకున్నారంది. అప్పటి నుంచి నచ్చిన వాడితో డేటింగ్ చేయాలని నిర్ణయించుకున్నానంది. అందుకే ఇప్పుడు తనకు నచ్చిన సిద్ధార్థ మల్హోత్రాతో ప్రేమలో ఉందంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.