YCP MLA: లోకేశ్ కు తెలుగు కూడా సరిగ్గా రాదు.. వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్!

YCP MLA: తాజాగా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తనపై విమర్శలు ఆరోపణలు చేసిన టీడీపీ నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అసలు నువ్వెంత‌, నీ బ‌తుకెంత రా? అస‌లు చంద్ర‌బాబుకు ఎట్లా పుట్టావురా? అంటూ బూతులు మాట్లాడుతూ ఒక రేంజ్ లో విరుచుకుప‌డ్డారు. కాగా ఇటీవల యువ‌గళం పాద‌యాత్ర‌లో భాగంగా కోవూరు నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో లోకేశ్ స్థానిక ఎమ్మెల్యే ప‌స‌న్న‌కుమార్‌రెడ్డిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన విషయం తెలిసిందే. కోవూరు ఎమ్మెల్యే న‌ల్ల‌ప‌రెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి న‌ల్ల‌తాచు పాము లాంటి వాడు,నాలుగేళ్ల‌లో ఇసుక‌, మ‌ట్టి దోపిడీతో రూ.1500 కోట్లు దోచేశాడు.

టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే కోవూరు ఎమ్మెల్యే అవినీతిపై సిట్ వేసి తిన్న‌ది మొత్తం క‌క్కిస్తామము, విడిచి పెట్టే ప్ర‌స‌క్తే లేద‌ంటూ విమర్శలు గుప్పించారు నారా లోకేష్. దీంతో ఆ వాఖ్యలపై స్పందించిన ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. లోకేష్ కి పాద‌యాత్ర‌లో స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం అల‌వాటు అయ్యింది. కోవూరు నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ నాయ‌కులు రాయించిన దాన్ని చ‌దివి, త‌న‌ను, జగన్ ని తిట్టి వెళ్లాడు. రూ.1500 కోట్ల అవినీతి ఆరోప‌ణ‌ల‌పై సీబీఐ విచార‌ణకు సిఫార్సు చేయాల‌ని త‌మ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను అడుగుతాను అని తెలిపారు. హైకోర్టు సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ‌కు డిమాండ్ చేశారు.

 

అవినీతి ఆరోప‌ణ‌లు నిజ‌మైతే త‌న‌ను బుచ్చిరెడ్డిపాళెంలో ఉరి తీయాలి అంటూ లోకేష్ కి ఛాలెంజ్ విసిరారు. వెంక‌య్య‌నాయుడు మంజూరు చేసిన అభివృద్ధి ప‌నుల్ని కూడా లోకేశ్ త‌న తండ్రి ఖాతాలో వేసుకున్నాడ‌ని విమ‌ర్శించారు. లోకేశ్‌కు స‌రిగా తెలుగు రాద‌ని విమ‌ర్శించారు. నెల్లూరులో ఎమ్మెల్యే అనిల్ రూ.1000 కోట్లు, త‌న‌పై రూ.1500 కోట్లు అవినీతికి పాల్ప‌డిన‌ట్టు ఆరోపించార‌న్నారు. ఇవాళ కావ‌లిలో ఎమ్మెల్యేపై రూ.2 వేల కోట్ల అవినీతి చేసిన‌ట్టు ఆరోప‌ణ‌లు చేస్తాడ‌న్నారు. ఇలా పెంచుకుంటూ పోతాడ‌ని ఆయ‌న వెట‌క‌రించారు. నీ ప‌క్క‌నే వున్న ఎమ్మెల్యే ఆనం రామనారాయ‌ణ‌రెడ్డి, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డిల‌ను అడిగితే త‌న ఆర్థిక ప‌రిస్థితి ఏంటో చెప్పేవార‌ని అన్నారు ప్రసన్నకుమార్ రెడ్డి.

 

అంతేకాకుండా నువ్వు అన్నట్టుగా నా దగ్గర రూ.1500 కోట్లు త‌న ద‌గ్గ‌ర వుంటే నెల్లూరు జిల్లాలోని ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీని నేల‌మ‌ట్టం చేసేవాడిన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వెయ్యి రూపాయ‌లున్నా పేద‌ల‌కు ఖ‌ర్చు పెట్ట‌డం త‌న నైజ‌ం అని న్నారు. నీ తాత రెండెక‌రాల భూమిని మీ తండ్రికి ఇచ్చాడ‌ని, ఇవాళ రూ.4 ల‌క్ష‌ల కోట్లు ఎక్క‌డి నుంచి వచ్చాయ‌ని నిల‌దీశారు ప్రసన్న కుమార్ రెడ్డి.
త‌న ఇంటికి టీడీపీ నేత‌ల్ని పంపిస్తే కుటుంబ స‌భ్యుల‌పై ఉన్న ఆస్తుల వివ‌రాల‌న్నీ ఇస్తాన‌ని, రూ.1500 కోట్లు సంపాదించిన‌ట్టు తేలితే మొత్తం పంచుతాన‌ని స‌వాల్ విసిరారు. అసలు నువ్వెంత‌? నీ వయసెంత నా కాలి గోటికి స‌రిపోవంటూ లోకేశ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -