Chittoor: ఒకరితో ప్రేమ మరొకరితో నిశ్చితార్థం.. చివరికి?

Chittoor: ఈ మధ్యకాలంలో యువత ప్రేమ అన్న మోజులో పడి వారి జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. కనిపించినా తల్లిదండ్రులను కాదని ప్రేమించిన నీకోసం ఎంతటికీ అయినా తెగిస్తున్నారు. మరి కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలను, అమ్మాయిలు అబ్బాయిలను ప్రేమించి పెళ్లి చేసుకుంటామని మాట ఇచ్చి చివరి క్షణంలో మాట మార్చుకోవడంతో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో చాలా చోటు చేసుకుంటున్నాయి.

తాజాగా కూడా ఒక కేటుగాడు ఒక యువతని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నిశ్చితార్థం కూడా చేసుకొని ఇప్పుడు మరో మహిళను ప్రేమిస్తుండడంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. అసలేం జరిగిందంటే..

చిత్తూరు జిల్లాకు చెందిన మణికుమార్తే నక్షత్ర బెంగుళూరులో డిగ్రీ చదువుతోంది. అదే ఏరియాకు చెందిన మూర్తి కుమారుడు ఆకాశ్ అనే యువకుడు గత కొంత కాలంగా నక్షత్రను ప్రేమిస్తున్న అంటూ వెంటపడ్డాడు. కొంతకాలం తర్వాత ఆకాశ్ ప్రేమకు నక్షత్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా కొంతకాలం పాటు ఇద్దరూ ప్రేమించుకున్న తర్వాత విషయం పెద్దలకు తెలియడంతో తమకు పెళ్లి జరిపించాలని పెద్దలను కోరారు.

ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి ఓకే చెప్పడంతో నిశ్చితార్థం కూడా ఘనంగా జరిపించారు. అయితే నక్షత్ర ఎడ్యూకేషన్ పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు కూడా ఒకే చెప్పారు. ఇలా కొన్ని నెలల తర్వాత ఆకాశ్ అదే ఏరియాలో మరో యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని తెలుసుకున్న నక్షత్ర షాక్ అయ్యింది. ఇదే విషయం పై ఆకాశ్, నక్షత్రకు మద్య గొడవ కూడా జరిగింది. ఇద్దరి మద్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో సమస్యను పరిష్కరించుకుందాం నీతో మాట్లాడాలి నక్షత్రను తీసుకొని బెంగుళూరులో ఒక పాత భవంతి పైకి తీసుకువెళ్లాడు. అలా మాట్లాడుతున్న సమయం లో నక్షత్రను పై నుంచి తోసేశాడు. దాంతో నక్షత్రకు తీవ్రంగా గాయపడింది. ఆ ప్రమాదంలో కాళ్లు విరిగిపోయి నక్షత్ర పూర్తిగా వీల్ చైర్ కే పరిమితం అయ్యింది. నడవలేని అమ్మాయిని తమ ఇంటికి కోడలిని చేసుకోము అంటూ ఆకాశ్ తల్లిదండ్రులు ప్లేట్ ఫిరాయించారు. దాంతో బాధితురాలు నక్షత్ర ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాల్సింది కోరారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -