Manchu Vishnu: ఇదేం ఫోజ్ విష్ణున్న అంటూ భారీ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

Manchu Vishnu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు.సినిమాల పరంగా మంచు వారసులు పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా మాత్రం పెద్ద ఎత్తున ఈ ఫ్యామిలీ ట్రోలింగ్ కి గురవుతూ ఉంటుంది.ఇలా సోషల్ మీడియాలో మంచు కుటుంబానికి సంబంధించిన ఏ ఒక్కరూ ఏ పోస్ట్ పెట్టిన పెద్ద ఎత్తున వైరల్ అవ్వడమే కాకుండా ఆ ఫోటోపై భారీ ట్రోలింగ్ జరుగుతుంది.

ఈ క్రమంలోనే తాజాగా మా అధ్యక్షుడు మంచు విష్ణు సోషల్ మీడియాలో ఒక ఫోటోని షేర్ చేశారు. అయితే ఈ ఫోటో కాస్త వింతగా ఉందని చెప్పాలి. నడిరోడ్డుపై ఈయన కాస్త వింతగా కూర్చొని ఉన్న ఫోటోని షేర్ చేయడంతో నేటిజన్ లు ఇదే అదునుగా భావించి ఈ ఫోటోని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.

 

మంచు విష్ణు ప్రస్తుతం జిన్నా సినిమా షూటింగ్లో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్లో భాగంగా తన చివరి రోజు అని చెబుతూ ఇలాంటి ఫోటోను షేర్ చేయడంతో పెద్ద ఎత్తున మంచు విష్ణుని భారీగా ట్రోల్ చేస్తున్నారు.మంచు విష్ణు ఇలా కూర్చున్న ఫోటోని షేర్ చేయడంతో కొందరు పక్కన చెంబు పెట్టి ఫోటోని ఎడిట్ చేయగా మరికొందరు డ్యాం దగ్గరికి వెళ్లి వాష్ చేసుకో విష్ణున్న అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఏది ఏమైనా మంచు ఫ్యామిలీ చేసే పోస్టుల కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారని ఈ పోస్ట్ చూస్తే మరోసారి అర్థమవుతుంది. ఈ విధంగా తన కుటుంబం గురించి ఎవరైనా నెగిటివ్ కామెంట్లు చేస్తే వారిపై పరువు నష్టం దావా వేస్తామని మోహన్ బాబు గట్టిగా వార్నింగ్ ఇచ్చినప్పటికీ నెటిజన్లు మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా వీరిపై భారీ ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Vishnu Manchu (@vishnumanchu)

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -