Manchu Vishnu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వార్తల్లో నిలిచే వారిలో మంచు ఫ్యామిలీ ముందు ఉంటుంది. మంచు ఫ్యామిలీలోఎవరో ఒకరు వార్తలు నిలుస్తూనే ఉంటారు. అందుకే మంచు ఫ్యామిలీ ఏం మాట్లాడినా అది చాలావరకు ఒక సెన్సేషన్ అవుతుంది. ముఖ్యంగా మంచు విష్ణు ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. దానికి నానార్థాలు వెతికి తనను ట్రోల్ చేయాలని చూసేవారు చాలామంది ఉంటారు. ఇక చాలాకాలం తర్వాత తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు. ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఈ క్రమంలోనే మరొకసారి నాగబాబును మళ్ళీ గెలికారు హీరో మంచు విష్ణు. ఈ సందర్బంగా విష్ణు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగగ్స్ ని నేను పెద్దగా పట్టించుకోను. నన్నే కాదు నాలా చాలామందిని ట్రోల్ చేస్తుంటారు. అందరిపైనా దుర్భాషలు మాట్లాడుతూ ట్రోలింగ్కి పాల్పడుతున్నారు. కానీ కొన్నిసార్లు మితిమీరినప్పుడు మాత్రం సహించలేదు. జన్యున్ గా ఎవరైన నాపై సెటైర్ వేస్తే ఎంజాయ్ చేస్తాను. కానీ కొన్ని పెయిడ్ బ్యాచ్లు ఉంటాయి. పనికట్టుకుని మరి డబ్బులిచ్చి ట్రోల్ చేయిస్తున్నారు. అయితే ట్రోలింగ్ అనేది ఎవరికి అవ్వడం లేదు.
ప్రభాస్కి అవ్వడం లేదా? మహేష్ బాబుకి అవ్వడం లేదా? తారక్కి అవ్వడం లేదా? అందర్నీ ట్రోల్ చేస్తున్నారు. మా ఎలక్షన్స్ ముందు వరకూ నాపై ట్రోలింగ్ ఉండేది కాదు. ఎలక్షన్ అప్పుడే నాపై ట్రోల్ చేశారు. అది ఎవరు చేయించారో అందరికీ తెలుసు. ఆ స్నేక్ బ్యాచ్ గురించి ఇప్పుడెందుకులే అని కవర్ చేసుకున్నారు మంచు విష్ణు. మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నాగబాబుని ఉద్దేశించి మంచు విష్ణు అలాంటి వ్యాఖ్యలు చేశారని పలువురు ఆరోపిస్తున్నారు.