Megastar: పూరీ జగన్నాథ్ చిరంజీవి కాంబో మూవీ స్టోరీ ఇదేనా?

Megastar: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి అందరికీ సుపరిచితమే. ఈయన హీరో క్యారెక్టరైజేషన్ కి అనుగుణంగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారు. ఈయన సినిమాలలో హీరోలు అల్లరి చిల్లరగా తిరుగుతున్న సమాజానికి సేవ చేసే ధోరణిలో హీరోలను చూపిస్తారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలకి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను అందించిన పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయలేదు.

మెగాస్టార్ చిరంజీవితో తన రీ ఎంట్రీ మూవీ ఆటో జానీ చేయాలని గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ సినిమా ముందుకు సాగలేకపోయింది.ఇక చిరంజీవి తర్వాత కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇకపోతే పూరి జగన్నాథ్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.ఇకపోతే ఇప్పటికే పూరి జగన్నాథ్ చిరంజీవికి ఒక స్టోరీ లైన్ చెప్పడంతో అది బాగా నచ్చిన మెగాస్టార్ ఫుల్ స్క్రిప్ట్ డెవలప్ చేయమని చెప్పారట.

ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ చిరంజీవి కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారని ఇండస్ట్రీ టాక్. ఇక పూరి జగన్నాథ్ చిరంజీవి కోసం గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో స్క్రిప్ట్ సిద్ధం చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇందులో మెగాస్టార్ చిరంజీవి డాన్ గా కనిపించబోతున్నారా లేకపోతే అందుకు వ్యతిరేకంగా పనులు చేసే వారికి భరతం పట్టే వ్యక్తి పాత్రలో కనిపించబోతున్నారా అనే విషయం తెలియడం లేదు.

 

ఇక పూరి జగన్నాథ్ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాలో పూరి జగన్నాథ్ డాన్ గా కనపడితే సినిమా వేరే లెవల్లో ఉంటుందని, మెగాస్టార్ చిరంజీవితో పూరి తప్పకుండా హిట్టు కొడతారని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇక పూరి జగన్నాథ్ విషయానికి వస్తే ఈయన విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో పూరీకి సినిమా అవకాశాలు మరోసారి కష్టతరంగా మారుతాయని అందరూ భావించారు. అయితే ఈయన ఊహించని విధంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -