Roja-Balakrishna: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం కావడంతో మొదటి రోజే అసెంబ్లీ సమావేశాలు చాలా ఉదృతంగా మారాయి. ఈ సమావేశాలలో భాగంగా అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో టిడిపి ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళన చేపట్టారు.
ఈ విధంగా టిడిపి ఎమ్మెల్యేలు ఈ స్థాయిలో ఆందోళనలు చేపట్టడంతో స్పీకర్ కొంత సమయం పాటు సభను వాయిదా వేశారు అయితే ఈ గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో ఆవేశంలో ఊగిపోయిన బాలకృష్ణ ఏకంగా అసెంబ్లీలో మీసం మెలేసి తొడ కొట్టారు. దీంతో వైసిపి మంత్రులు ఎమ్మెల్యేలు బాలకృష్ణ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా అసెంబ్లీలో బాలకృష్ణ మీసం మేలేసి తొడ కొట్టడంతో మంత్రి అంబటి రాంబాబు అసెంబ్లీలోనే తీవ్రస్థాయిలో బాలకృష్ణకు కౌంటర్ ఇచ్చారు. అయితే నటి మంత్రి రోజా సైతం బాలకృష్ణ చేసినటువంటి ఈ చేష్టలపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. నువ్వు మీసం మెలేసి తొడకొడితే భయపడటానికి ఇదేమైనా సినిమా అనుకున్నావా అంటూ రోజా కూడా తన స్టైల్ లో బాలయ్య చేష్టలకు కౌంటర్ ఇచ్చారు.
ఈ విధంగా చట్టసభలలో బాలకృష్ణ ప్రవర్తన కారణంతో ఒక్కసారిగా అసెంబ్లీలో వాతావరణం చాలా హాట్ హాట్ గా కొనసాగింది. ఈ విధంగా టిడిపి ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపట్టినటువంటి తరుణంలో స్పీకర్ మొదటి రోజే 14 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఇలా సస్పెండ్ అయినటువంటి ఈ ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీ బయట పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ జగన్ ప్రభుత్వం పై విమర్శలు కురిపించారు.