Thaman: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ థమన్ గురించి గురించి మనందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో థమన్ తరచూ ఏదో ఒక విషయంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఓ సారి బ్లాక్ బాస్టర్ హిట్ పాటలతో ట్రెండ్ అయితే మరోసారి కాపీ క్యాట్ అంటూ ట్రోల్ అవుతుంటారు. అప్పుడప్పుడు ఆయన మాట్లాడే మాటలు కూడా మరింత వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా భగవంత్ కేసరి సినిమా సక్సెస్ మీట్లో ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారీ తీశాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
ట్విట్టర్ తెరిస్తే నా కొడుకులు ఏదేదో వాగుతున్నారు. వాళ్లకేం తెలుసంటూ అంటూ స్టేజ్పై సీరియస్గా కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా తమన్ ఎక్కువగా నెగెటివిటీని ఎదుర్కొంటారన్న సంగతి తెలిసిందే. ఆయన వర్క్ను తక్కువ చేస్తూ పలువురు నెటిజన్లు తీవ్ర విమర్శలు కురిపిస్తుంటారు. దానిని ఉద్దేశించే తమన్ సక్సెస్ మీట్లో ఇలా వ్యాఖ్యలు చేశారు. కాగా, తమన్ చేసిన కామెంట్స్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక పబ్లిక్ ఫిగర్ ఇలా బహిరంగ ప్రదేశాల్లో ఇలా ఘాటుగా మాట్లాడటం సరికాదు అని కామెంట్స్ చేయగా మరికొందరు ఎవరి టాలెంట్ వారిది టాలెంట్ ని గుర్తించాలి తప్ప వేలెత్తి చూపించకూడదు అంటూ థమన్ కి అనుగుణంగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే భగవంత్ కేసరికి ఆయన అందించిన మ్యూజిక్ ప్లస్గా నిలిచింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ బాగుందని అంటున్నారు. అయితే ఆయన గత సినిమా స్కంద సినిమా విషయంలో మాత్రం నెగిటివిటీని ఎదుర్కొన్నారు. కొందరు ఆయన చేసిన పనిని తప్పు పట్టడం కాదు వారిపైన గౌరవించి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలుసుకొని మాట్లాడాలి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ని బేస్ చేసుకుని ఆయనపై ట్రోల్స్ చేయడం కంటే నిజానిజాలు తెలుసుకోవడం బెటర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.