Nandamuri Harikrishna: హరికృష్ణ చివరి కోరికను ఎవరు తీర్చలేకపోయారా… ఇన్నేళ్లకు బయటపడిన అసలు విషయం?

Nandamuri Harikrishna: సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో మనకు తెలిసిందే. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు,నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి కథ అయినా ఎంతో సునాయసంగా నటించే గొప్ప నటుడు ఎన్టీఆర్. కేవలం కుటుంబ కథా చిత్రాలు మాత్రమే కాకుండా ప్రేమ కథ చిత్రాలు పౌరాణిక చిత్రాలలో కూడా ఇట్టే ఒదిగిపోయినటించేవారు.

ఈ క్రమంలోనే అప్పట్లో పౌరాణిక సినిమాలంటే రాముడైనా, అర్జునుడైన శ్రీకృష్ణుడైన అన్నగారి తర్వాతే అనేవారు. అంతలా పౌరాణిక సినిమాలలో నటించి గుర్తింపు పొందారు. ఇక ఈయన వారసులుగా ఇండస్ట్రీలోకి హరికృష్ణ బాలకృష్ణ వంటి వారు వచ్చిన విషయం మనకు తెలిసిందే.ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎన్టీఆర్ తన కుమారులు బాలకృష్ణ హరికృష్ణతో కలిసి మాయాబజార్ సినిమాను రీమేక్ చేయాలని భావించారు.

అర్జునుడుగా కృష్ణుడిగా బాలయ్య హరికృష్ణలతో ఈ సినిమా చేయాలని భావించారట అయితే అదే సమయంలోనే రాజకీయాలలోకి రావడం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న దిశగా అడుగులు వేస్తూ సినిమాలకు కాస్త దూరమై పూర్తిగా రాజకీయాల్లో నిమగ్నం కావడం వల్ల ఈ సినిమాని చేయలేకపోయారు. ఇక ఈ సినిమాని రామకృష్ణ సినీ స్టూడియోస్ లోనే నిర్మించాలని భావించారట. అయితే ఎన్టీఆర్ రాజకీయాలలో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాని పూర్తిగా పక్కన పెట్టారు.

ఇక ఈ సినిమాలో నటించాలని హరికృష్ణ చాలా కోరికగా ఉండేదట. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీదేవిని పెట్టి చేయాలని భావించారట. ఈ సినిమా చేయాలని ఎంతో కోరికతో ఉన్నటువంటి హరికృష్ణకు ఈ సినిమా చేసే అవకాశం లేకుండా పోయింది. ఇక రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించడంతో, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఏ ఇతర నందమూరి హీరోలు కూడా ఆ సినిమాని టచ్ చేయలేరని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -