Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల వేడి రాజుకుంటుంది ఈ క్రమంలోనే అధికార పక్షం ప్రతిపక్షం పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలను నిర్వహిస్తూ ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలను నిర్వహిస్తూ ఉండగా తాజాగా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ కలిసి జెండా అనే బహిరంగ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమం బుధవారం సాయంత్రం తాడేపల్లిగూడెంలో జరిగింది. ఇలా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు అలాగే జనసేన కార్యకర్తలు అభిమానులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ స్పీచ్ చాలా హైలెట్ అయిందని చెప్పాలి. ఇక ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం కావడంతో తెలుగుదేశం పార్టీ ప్రధాన జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.
జెండా కార్యక్రమానికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఇక ఈ వీడియోని షేర్ చేసినటువంటి లోకేష్ ప్రజా అజెండా రాష్ట్ర ప్రగతి అజెండా టిడిపి జనసేన జెండా సభ. అరాచక పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన సభ. కోట్లాది భవితకు గ్యారెంటీ ఇచ్చిన సభ అంటూ ఈ వీడియోని లోకేష్ షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇలా ఈ జెండా సభ పెద్ద ఎత్తున విజయవంతం కావడంతో ఈ సభ చూసి వైసిపి నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయన్న ఉద్దేశంతో నారా లోకేష్ చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మాత్రమే పాల్గొనారు కానీ నారా లోకేష్ మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.
ప్రజా అజెండా.. రాష్ట్ర ప్రగతి అజెండా.. టిడిపి-జనసేన 'జెండా' సభ. అరాచక పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన సభ. కోట్లాది జనాల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇచ్చిన సభ.#TeluguJanaVijayam #TDPJSPWinning #TDPJSPTogether #TDPJSPAlliance #AndhraPradesh pic.twitter.com/1RTj4KHmI9
— Lokesh Nara (@naralokesh) February 29, 2024