Nara Lokesh: స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా చంద్రబాబు నాయుడు అరెస్టయి నేటితో 50 రోజుల పూర్తి అయ్యింది. ఈ క్రమంలోనే నేడు ములాఖత్ లో భాగంగా నారా భువనేశ్వరి లోకేష్ ఎదురు కూడా చంద్రబాబు నాయుడుని కలిశారు. ఇలా చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం నారా లోకేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుని కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే అరెస్టు చేశారని తెలియజేశారు. ఎన్నికల సమయంలో ఆయన ప్రజల ముందుకు రాకుండా ఉండడం కోసమే అధికార ప్రభుత్వం ఇలాంటి కుట్ర చేసిందని ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి 50 రోజులు అవుతుంది ఇప్పటివరకు కనీసం ఒక్క ఆధారమైన బయట పెట్టారా అంటూ ఈయన ప్రశ్నించారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు అందుకే అధికారులు ఆధారాలను బయట పెట్టలేకపోతున్నారని లోకేష్ తెలియజేశారు. ఇక మేము అవినీతి చేసినట్లు అధికారులు నిరూపించాలని, ఇక మా ఆస్తుల వివరాలన్నింటినీ కూడా ప్రజల ముందు ఉంచడానికి తామసిద్దంగా ఉన్నామని లోకేష్ తెలియజేశారు. చంద్రబాబు నాయుడుని జైలులో పెట్టి అధికార ప్రభుత్వ నేతలు ఆనందం పొందుతున్నారని తెలిపారు.
చంద్రబాబు నాయుడు గారికి జైలులో ప్రాణహాని ఉందనీ లోకేష్ తెలిపారు. ఈ విషయాన్ని వైసిపి నేతలు బహిరంగ సభలలో తెలియజేస్తున్నారు.చంద్రబాబు నాయుడుని చంపేస్తామంటూ బహిరంగంగా చెబుతున్నారని లోకేష్ తెలిపారు. ఇక నారా భువనేశ్వరి న్యాయం గెలవాలి పేరిట ప్రజలలోకి వెళ్తూ ఉండగా ఓ వైసిపి మహిళా మంత్రి తనని కూడా అరెస్టు చేసి లోపల వేస్తాము అంటూ మాట్లాడారని ఈయన గుర్తు చేశారు. ముందు ప్రజా సమస్యపై దృష్టి పెట్టకుండా తమ ప్రభుత్వాన్ని తమని వైసిపి ప్రభుత్వం టార్గెట్ చేస్తూ ఇలా కక్ష సాధిస్తుంది అంటూ ఈ సందర్భంగా లోకేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.