Naresh-Pavitra Lokesh: పవిత్రతో నాది పవిత్ర బంధం అన్న నరేష్.. అసలేమైందంటే?

Naresh-Pavitra Lokesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన వారిలో నరేష్ పవిత్ర లోకేష్ జంట ఒకటి అని చెప్పాలి.నరేష్ పవిత్ర ఇద్దరు పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే ఓ సినిమా షూటింగ్లో భాగంగా వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు.

పవిత్ర లోకేష్ నరేష్ తో రిలేషన్ లో ఉండకముందే నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకుని తన ముగ్గురు భార్యలకు దూరంగా ఉంటున్నారు. అయితే పవిత్ర లోకేష్ నరేష్ కు దగ్గర కావడంతో నరేష్ ఆస్తి కోసమే పవిత్ర తనకు దగ్గరవుతుందంటూ ఈమె గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే నరేష్ మాత్రం ఈ వార్తలను ఖండించారు.తాజాగా వీరిద్దరూ మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.

 

ఇంటర్వ్యూలో భాగంగా నరేష్ తన ఆస్తి వివరాలను బయట పెట్టడమే కాకుండా పవిత్రతో తనకు ఉన్నటువంటి రిలేషన్ కూడా బయట పెట్టారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ…తనకు 1000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని తాను ఒక బిలీనియర్ అంటూ ఈయన కామెంట్ చేశారు. అయితే అదంతా కూడా వైట్ మనీ అని నరేష్ తెలిపారు.

 

తనకు వారసత్వంగా కొంత ఆస్తి వచ్చిందని మరికొంత ఆస్తి తాను కష్టపడి సంపాదించుకున్నానని నరేష్ తెలియజేశారు.ఇక నా వద్ద ఇంత ఆస్తి ఉండడంతో చాలామంది నా ఆస్తి కోసమే వచ్చారు. మరి కొందరు నన్ను వదిలి వెళ్ళిపోయారు కూడా అయితే పవిత్ర మాత్రం అలా కాదు నా ఆస్తి చూసి రాలేదని, మా ఇద్దరిదీ ఎప్పటికీ పవిత్ర బంధం అంటూ ఈ సందర్భంగా నరేష్ కామెంట్ చేశారు.ఇక పవిత్ర కూడా నరేష్ తో తనకున్నటువంటి అనుబంధం గురించి మాట్లాడారు. ఇప్పటికే మా ఇద్దరికి పెళ్లి జరిగిన ఫీలింగ్ ఉంటుంది. చివరి వరకు మా బంధం ఇలాగే ఉంటుందని పవిత్ర తెలియజేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -