Malli Pelli Teaser: నరేష్ మళ్లీ పెళ్లి టీజర్.. రమ్య రఘుపతిని టార్గెట్ చేస్తూ?

Malli Pelli Teaser: సీనియర్ హీరో నరేష్, నటి పవిత్ర లోకేష్ ల గురించి మనందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా ఈ జంట సహజీవనం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఈ ఏడాది ఆరంభంలో లిప్ లాక్ పెట్టుకుంటూ త్వరలోనే ఒక్కటి కాబోతున్నాము మీ ఆశీర్వాదాలు కావాలి అంటూ కూడా ఫోటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో నరేష్ పవిత్రానికి కాంబినేషన్లో రూపొందిన సినిమా మళ్లీ పెళ్లి. ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు.

అయితే పవిత్ర లోకేష్, నరేష్ అలాగే రమ్య రఘుపతి వీరి ముగ్గురు మధ్య జరుగుతున్న సంఘర్షణలే సినిమా రూపంలో రూపొందించినట్టు టీజర్ చూస్తే బాగా అర్థం అవుతోంది. ఆ టీజర్ ని చూస్తుంటే పవిత్ర లోకేష్ నరేష్ ల బంధం గురించి రమ్య రఘుపతి చేసినా కామెంట్స్ ఆ సమయంలో సంచలనంగా మారిన వార్తలు డైలాగులే మళ్లీ మళ్లీ వినిపించినట్టుగా ఉన్నాయి. నరేష్ తొలి భార్య క్యారెక్టర్ అనిపించేలా డిజైన్ చెేసిన పాత్రలో వనిత విజయ్ కుమార్ కనిపించారు. నరేష్ ఫ్యామిలీ బ్యానర్ విజయ కృష్ణా మూవీస్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. మే నెలలో ఈ సినిమా విడుదల కానుంది. టీజర్ ని చూసిన చాలామంది ప్రేక్షకులు నరేష్ పవిత్ర లోకేష్ పై మండిపడుతున్నారు.

జీవితంలో జరిగిన సంఘటన సినిమా రూపంలో తెరకెక్కిస్తున్నారు అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. రమ్య రఘుపతిని ఉద్దేశిస్తూ ఈ టీజర్ ని విడుదల చేశారంటూ ఒక వర్గం ప్రేక్షకులు ఆరోపిస్తున్నారు. మరి ఈ టీజర్ పై రమ్య రఘుపతి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి. కొంతమంది ఈ టీజర్ పై స్పందిస్తూ నిజజీవితంలో రమ్య రఘుపతి స్థానంలో సినిమాలో పనిత విజయ్ కుమార్ నటించిన ది అంతకుమించి పెద్దగా మార్పులు ఏమీ లేవు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమా విడుదల అయితే కచ్చితంగా కాంట్రవర్సీ లను కొని తెచ్చుకున్నట్టే అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -