Amala: అమలపై నెటిజన్లు ఫైర్.. కుక్కల బాధలు నీకేం తెలుసంటూ?

Amala: ఇటీవలే హైదరాబాద్ లోని అంబర్ పేట్ లో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ ప్రాణాలు కోల్పోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ ఘటన ప్రతి ఒక్కరిని చింతించేలా చేసింది. ఇక ఈ ఘటనపై డైరెక్టర్ ఆర్జీవి కూడా సోషల్ మీడియా వేదికగా పోరాడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇక ఈ ఘటన తెలిసిన వెంటనే వీధి కుక్కలను పారద్రోలేందుకు చర్యలు తీసుకోవాలి అని ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు.

కానీ జంతు ప్రేమికులు మాత్రం కుక్కలపై దయ చూపాలి అంటూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఎప్పటికప్పుడు నెటిజన్స్ వారిపై ఫైర్ అవుతూనే ఉన్నారు. ఇప్పటికే యాంకర్ రష్మీపై కూడా ఫైర్ అయ్యారు. అయితే తాజాగా నాగార్జున భార్య, నటి అమలపై కూడా ఫైర్ అవుతున్నారు. ఇక ఈమె కూడా జంతు ప్రేమికురాలే.

 

అయితే ఆమె ఈ ఘటన గురించి స్పందించగా.. మొత్తం కుక్కలపై కోపం, ద్వేషం పెంచుకోవడం సరికాదని.. వాటిని ఎంతగా ప్రేమిస్తే అవి కూడా తిరిగి అంతగా ప్రేమిస్తాయని కొన్ని కామెంట్లు చేసింది. దీంతో వెంటనే నెటిజన్స్ ఆమెపై ఫైర్ అవుతున్నారు. అమల గారు మీకు వీధి కుక్కల మీద అంత ప్రేమ ఉంటే పది పిచ్చి కుక్కలను తెచ్చి మీ కొంపలో ఉంచుకోండి.. అప్పుడు తెలుస్తుంది కుక్కలతో ఎంత ప్రమాదం ఉంటుంది అని ఫైర్ అవుతున్నారు.

 

ఏసీ కొంపలో ఉంటూ ఏసీ కారులో తిరిగి వచ్చే నీకు ఏం తెలుసు.. సమాజంలో తిరిగే సామాన్య ప్రజలు కుక్కలతో పడే బాధలు ఏంటో నీకు తెలుసా.. నీకు అంత ప్రేమ ఉంటే నీ మొగుడు సంపాదించాడు కదా బాగా.. కావాలంటే ఒక 10 ఎకరాల స్థలం కొని వాటిని మేపు.. అంతేకానీ ఇక్కడికి వచ్చి పతిత్తు మాటలు చెప్పమాకు.. ఒక మనిషి ఇలా కొరుకుతే కనీసం ఒక నెల శిక్ష పడుతుంది.. మరి కుక్కలని ఏం చేయాలి అంటూ నేరుగా ప్రశ్నించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -