Nikhil: వైరల్ అవుతున్న నిఖిల్ షాకింగ్ కామెంట్స్.. అలా చేశానంటూ?

Nikhil: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తాజాగా నటించిన చిత్రం స్పై. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో ఎప్పటి నుంచో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. అదేమిటంటే హీరో నిఖిల్ కి నిర్మాత రాజశేఖర్ రెడ్డి మధ్య జరిగిన గొడవ గురించి అందరికీ తెలిసిందే. క్వాలిటీ కోసం, సినిమాను పాన్ ఇండియా లెవెల్లో ప్రమోట్ చేయడం కోసం విడుదలను వాయిదా వేయమన్నాడు నిఖిల్. అలా చేస్తే చాలా నష్టం వస్తుంది కాబట్టి కుదరదన్నాడు నిర్మాత.

 

హీరో నిఖిల్ తో సంబంధం లేకుండానే లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. అతడితో సంబంధం లేకుండా మరోసారి రిలీజ్ డేట్ పోస్టర్ కూడా వదిలారు. తప్పనిసరి పరిస్థితుల మధ్య నిర్మాత దారిలోకి వచ్చాడు నిఖిల్. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా దీనిపై స్పందించాడు. అయితే ఈ విషయాలపై తాజాగా స్పందించారు నిఖిల్. స్పై మూవీ ప్రమోషన్స్ లో భాగంగా స్పందిస్తూ.. అవును నిజమే.. మేం కొట్టుకున్నాం, తిట్టుకున్నాం. కానీ మేము ఏం చేసినా అన్నీ సినిమా కోసమే. ఇప్పుడంతా ఓకే. నిర్మాతను నేను ఒకటే కోరాను. 250 రూపాయలు పెట్టి థియేటర్ కు వచ్చే ప్రేక్షకుడ్ని ఎంటర్ టైన్ చేయాలి.

ఇది మంచి సినిమా, అందుకే టైమ్ తీసుకుందామని కోరాను. కానీ క్వాలిటీలో కాంప్రమైజ్ కాలేదు. ఏమాత్రం క్వాలిటీ లేకపోయినా మార్నింగ్ షో తర్వాత ఆడియన్స్ ఉండరు. మేం ఆ పని చేయలేదు. ఈ విషయంలో దర్శక నిర్మాతలు నన్ను శాటిస్ ఫై చేశారు. నేను తృప్తి చెందాను కాబట్టే, ఇప్పుడు మీడియా ముందుకు స్వచ్ఛందంగా, ధైర్యంగా వచ్చాను అని చెప్పుకొచ్చారు నిఖిల్. హీరో నిఖిల్ ఈమధ్య కాలంలో మంచి ఊపు మీద ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తుండగా సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -