NTR: అదొక్కటే బ్యాలెన్స్ అంటున్న తారక్ ఫ్యాన్స్.. అదుర్స్ అంటూ?

NTR: జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆయన సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అభిమానులు అడుగుతున్నారు. అయితే ఎన్టీఆర్ ఇటీవలే ఫ్మామిలీతో కలిసి అమెరికా వెకేషన్ ముగించుకొని హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. దీంతో ఫ్యాన్స్ కి ఆశలు మొదలయ్యాయి. ఆర్ఆర్ఆర్ తరువాత తారక్ కొరటాల దర్శకత్వంలో నటించాల్సి ఉంది. అటుపై కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో నటిస్తారు.ఆర్ఆర్ఆర్ విడుదలై సంవత్సరం కావస్తోంది. ఇప్పటి వరకు కొరటాల చిత్రం ప్రారంభం కాలేదు. కథలో మార్పులు.. చేర్పుల వలనే ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతున్నట్లు సమాచారం.

 

ఈ మధ్యలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగాయి. ఈ చిత్రానికి అనిరుథ్ స్వరాలందిస్తున్నారు. అయితే తారక్ తన ఫ్యామిలీతో కలిసి డిసెంబరు నెలలో వెకేషన్ వెళ్లారు.తాజాగా అది పూర్తి చేసుకుని హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయ్యారు.శనివారం ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్‌ వచ్చారు.

 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయన విజువల్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారికి ప్రాణాలు లేచి వచ్చినట్టుగా ఉంది. త్వరలోనే ఎన్టీఆర్ 30వ చిత్రంపై అదిరిపోయే అప్ డేట్స్ వస్తాయని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం ఫిబ్రవరి మొదటి వారం నుంచి రెగ్యూలర్ చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. షూటింగ్‌ కూడా గ్యాప్‌ లేకుండా లాంగ్‌ షెడ్యూల్‌ని ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం.

 

అయితే ఈ చిత్రంలో ఇంకా హీరోయిన్ ఎవరు అనేది ఫైనల్ కాలేదు. అతి త్వరలో హీరోయిన్‌ ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందట. ఈ సినిమాలో శ్రీదేవి తనయ, బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్‌ ఫైనల్‌ అయినట్లు తెలుస్తుంది. ఆమెని చిత్ర బృందం ప్రకటించే అవకాశం ఉంది.ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్,ఎన్టీఆర్‌ ఆర్ట్స్ పతాకాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది వాటర్‌ నేపథ్యంలో యాక్షన్‌ డ్రామా చిత్రంగా ఉండబోతున్నట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -