Sr NTR: భార్య మాట కోసం ఎన్టీఆర్ చేసిన పనికి షాకవ్వాల్సిందే!

Sr NTR: నందమూరి తారకరామారావు.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తనదైన ముద్రను వేశారు నందమూరి తారక రామారావు. కాగా అప్పట్లో 1981 లో కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు రాష్ట్ర ముఖ్య‌మంత్రిని ఢిల్లీలో నిర్వ‌హించ‌డం లాంటి చ‌ర్య‌ల వ‌ల్ల‌ రాష్ట్ర ప్ర‌జ‌ల ఇబ్బందులు ప‌డుతుండగా, అదే స‌మ‌యంలో నంద‌మూరి బ‌స‌వ‌తారకం గారు మీరు రాజ‌కీయాల్లోకి రావాలి. ప్ర‌జ‌లకు న్యాయం చేయడం కోస‌మే అలాగే విలేక‌ర్ల ముందు ప్ర‌క‌ట‌న చేయాలని చెప్పారట. 1981లో స‌ర్దార్ పాపారాయుడు షూటింగ్ విరామంలో భాగంగా ఒక విలేక‌రీ మ‌రో ఆరు నెల‌ల్లో నీరు 60 సంవ‌త్స‌రాలు నిండిపోతున్నాయి.

నీ జీవితానికి సంబంధించిన మీరు ఏమైనా కొత్త నిర్ణ‌యాలు తీసుకున్నారా ? ఎన్టీఆర్‌ని ప్రశ్నించగా.. ఆ విషయంపై స్పందించిన ఎన్టీఆర్ నిమ్మ‌కూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను. కానీ తెలుగు ప్రేక్ష‌కులు న‌న్ను ఎంత‌గానో అభిమానించి ఆద‌రించారు. త‌రువాత పుట్టిన రోజు నుంచి ప్ర‌తీ నెల 15 రోజుల పాటు ప్ర‌జా సేవ‌కే నా జీవితాన్ని అంకితం చేస్తానని మాట ఇచ్చాట. తర్వాత 1982 మార్చి 28న ఆయ‌న హైద‌రాబాద్‌కి వ‌చ్చిన‌ప్పుడు రెడ్ కార్పేట్ వేసి మ‌రీ స్వాగ‌తం ప‌లికారట. 1982 మార్చి 28 మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు కొత్త‌గా పార్టీ పెట్ట‌బోతున్న‌ట్టు ఎన్టీఆర్ ప్ర‌క‌టించారు. ఆ పార్టీకి తెలుగుదేశం అనే పేరు పెడుతున్న‌ట్టు ప్ర‌క‌టించి అలా టీడీపీ ఆవిర్భావం జ‌రిగింది. ప్ర‌సంగాలు చేశాడు. దానికే చైత‌న్య ర‌థం అని పేరు కూడా పెట్టాడు. ఆ చైత‌న్య ర‌థం నుంచి క‌దిలిరా అనే నినాదంతో చైత‌న్య ర‌థం ప్రారంభించారు.

సామాన్య శ్రామికుడి లాగా మొదలుపెట్టి ప్రజల్లో చైతన్యాన్ని కలిగించారు. ఎన్టీఆర్ ఉద్వేగ‌భ‌రితంగా ప‌దే ప‌దే మారుతున్న శాస‌న స‌భ‌ల ఎన్నికలైన తెలుగు వారికి ప్రాముఖ్య‌త లేక‌పోవ‌డాన్ని ముఖ్య‌మైన ఆయుధంగా చేసుకొని కాంగ్రెస్ నాయ‌కుల‌ను విమ‌ర్శించేట‌ప్పుడు ఘాటైన ప‌దాలే వాడారు. ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మ‌గౌర‌వాన్ని పెంచుతార‌ని అఖిలాంధ్ర ప్రేక్ష‌కులు న‌మ్మారు. 1983 జ‌న‌వ‌రి 07న మ‌ధ్యాహ్నం ఎన్నిక‌ల ఫ‌లితాల ప్ర‌క‌ట‌న జ‌రిగింది. తెలుగుదేశం 199 కాంగ్రెస్ 60, సీపీఐ 4, సీపీఐఎం 5 బీజేపీ 3 సీట్లు గెలుచుకున్నాయి. అది తెలుగుదేశం పార్టీ ప్ర‌భంజ‌నం అని చెప్ప‌వ‌చ్చు. 90 ఏండ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని కేవ‌లం 9 నెల‌ల క్రితం పెట్టిన తెలుగుదేశం పార్టీ ఓడించి విజయం సాధించింది. తర్వాత కేంద్రాన్ని ఎదురించ‌డం మొద‌లుపెట్టారు ఎన్టీఆర్‌.

అధికారంలోకి వ‌చ్చాక ఎన్నో వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు తీసుకున్నారు. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌గ్గింపు, ఈ నిర్ణ‌యాల్లో చాలా ప్ర‌ధాన‌మైన‌ది. అతిత‌క్కువ కాలంలోనే ప్ర‌జాధార‌ణ కోల్పోయారు ఎన్టీఆర్‌. 1984లో నాదెండ్ల భాస్క‌ర్‌రావు ముఖ్య‌మంత్రి అయ్యారు. ఎన్టీఆర్ మ‌ళ్లీ ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు. ఆయ‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని వెలుగెత్తి చాటాడు. త‌న‌పైన జ‌రిగిన రాజ‌కీయ కుట్ర అని చెప్పారు. ఇక ఈ స‌మ‌యంలో మిత్ర‌ప‌క్షాలు ఎన్టీఆర్‌కి ఎంత‌గానో స‌హాయం చేశాయి. ఫలితంగా సెప్టెంబ‌ర్ 16న నందమూరి తార‌క‌రామారావు గారిని మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌క‌టించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. కేవ‌లం నెల‌రోజుల కాలంలోనే తిరిగి ముఖ్య‌మంత్రి అయి ప్ర‌భంజ‌నాన్ని సాటిన వ్య‌క్తి ఎన్టీఆర్. కాగా 1984- 99 కాలం ఎన్టీఆర్ రాజ‌కీయ జీవితానికి గ‌డ్డుకాల‌మ‌నే చెప్పాలి. ప్ర‌తిప‌క్ష నాయ‌కులుగా శాస‌న‌స‌భ‌లో కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల చేతిలో ఎన్నో అవ‌మానాలు పొందారు ఎన్టీఆర్.

ఆ స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీ స‌భ్యుల‌ను 9 సార్లు స‌భ నుంచి బ‌హిష్క‌రించారు. ఎన్ని అవమానాలు చేసినా కూడా తన భార్య కోసం ఎన్టీఆర్ వాటన్నిటిని భరించారట. ఆ స‌మ‌యంలో ఎన్టీఆర్ నాలుగు సినిమాల్లో కూడా న‌టించారు. 1993లో ల‌క్ష్మీపార్వ‌తిని రెండవ వివాహం చేసుకున్నారు. ఆ స‌మ‌యంలో ఎన్టీఆర్ నాలుగు సినిమాల్లో కూడా న‌టించారు. 1993లో ల‌క్ష్మీపార్వ‌తిని రెండవ వివాహం చేసుకోవడంతో ఈ కుటుంబ స‌భ్యుల మ‌ధ్య విభేదాలు ఏర్ప‌డ్డాయి. 1994లో రూ.2కే కిలో బియ్యం, పూర్తి మ‌ద్య‌పాన నిషేదం వంటి నినాదాల‌తో ప్ర‌జ‌ల‌కు ముందుకు వ‌చ్చారు. అప్ప‌టి ఎన్నిక‌ల్లో ఎవ్వ‌రూ ఊహించ‌నివిధంగా టీడీపీ ఘ‌న విజ‌యం సాధించింది. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే హామీల‌ను అమ‌లు ప‌రిచారు. ల‌క్ష్మీపార్వ‌తి పార్టీ విష‌యంలో ఎక్కువ‌గా జోక్యం చేసుకోవ‌డంతో పార్టీలో వివాదాలు చోటు చేసుకున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -