Chandrababu: ఎన్టీఆర్ కలను నిజం చేయడమే కర్తవ్యం.. చంద్రబాబు కామెంట్స్ వైరల్!

Chandrababu: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా నందమూరి తారక రామారావుని స్మరించుకుంటూ ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ కూడా చేశారు. ఒకే ఒక జీవితం.. రెండు తిరుగులేని చరిత్రలు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలతో ఒక రైతుబిడ్డ సాధించిన అద్వితీయ విజయానికి ప్రతీక ఎన్టీఆర్‌.. తెలుగు నాట నిరుపేదకు రామరాజ్య సంక్షేమాన్ని అందించిన మానవతావాది.. తెలుగు జాతికి తరతరాలకు సరిపడా ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన వెలుగు ఆయన.

 

పేదరికం లేని, కులమతాలకు అతీతమైన సమ సమాజాన్ని స్థాపించాలన్న ఎన్టీఆర్ కలను నిజం చేయడమే మన కర్తవ్యం కావాలి. బలహీన వర్గాల అణచివేత, పేదలను ఇంకా పేదలుగా మారుస్తున్న పాలన, సమాజంలో ఏ ఒక్కరికీ దక్కని భద్రతతో తెలుగునేల అల్లాడుతున్న ఈ వేళ.. రామరాజ్య స్థాపనకు మనందరం కదలాలి. అందుకే తెలుగుదేశం పిలుస్తోంది.. రా.. కదలిరా అని ఆనాడు ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు స్ఫూర్తిగా.. నేను రా… కదలిరా’ అని పిలుపునిచ్చాను. తెలుగు ప్రజలారా! రండి.. ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం.

ఎన్టీఆర్‌కు అసలైన నివాళి అర్పించుదాం అని పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా బాబు చేసిన వాఖ్యలు పోస్ట్ వైరల్ గా మారాయి. బాబు చేసిన వాఖ్యలకూ టీడీపీ నేతలు మద్దతు పలుకుతూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు మరింత హాట్ టాపిక్ గా మారుతున్నాయి. వచ్చే ఏడాది ఎలా అయినా గెలవాలి అని టిడిపి కసితో ముందుకు దూసుకెళ్తోంది..

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -