Raja Sulochana: వేశ్య‌గా ముద్ర‌ప‌డిన నటిని గొప్ప హీరోయిన్‌గా మార్చిన ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే?

Raja Sulochana: రాజసులోచన ఈ తరం ప్రేక్షకులకు ఈ పేరు గురించి అంతగా తెలియక పోయినప్పటికీ ఆతరం ప్రేక్షకులు ఈమెను ఇట్టే గుర్తుపట్టిస్తారు. ఒకప్పుడు ఈమె పాపులర్ నటిగా మాత్రమే కాకుండా డాన్సర్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఈమె అసలు పేరు రాజలోచన. తల్లిదండ్రులకు ఆమె ఏకైక సంతానం. అందుకే చిన్నతనం నుంచి ఎంతో గారాబంగా పెంచేవారు. ఆమె పట్ల తమకున్న గౌరవాన్ని, అభిమానాన్ని తెలియజేసేందుకు ఆమె పేరు ముందు రాజా అనే పదాన్ని కూడా చేర్చారు. అయితే, ఆమె పాఠశాలలో చేరినప్పుడు, ఆమె పేరు తప్పుగా రాజసులోచన అని రాయడం జరిగింది.

అదే చివరికి ఆమె అఫీషియల్ పేరుగా మారింది. అయితే రాజసులోచన చిన్నతనం నుంచే డ్యాన్స్‌ని ఇష్టపడింది. ఆ అభిరుచిగా పెద్దయ్యాక కూడా కొనసాగించింది. సినిమాల్లో నర్తకిగా కనిపించాలని ఆశపడింది. ఆమె కలలను నెరవేర్చడంలో తల్లిదండ్రులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈ నటి తన తండ్రికి ఇష్టం లేని వేశ్య పాత్రతో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. తన తల్లి ప్రోత్సాహంతోనే వేశ్య అయినా పెద్దగా భయపడకుండా ఆమె అందులో నటించింది.

దురదృష్టవశాత్తు, ఆ పాత్ర ఆమెకు కళంకంలా మారింది .ఆమె చాలా సినిమాల్లో వేశ్యగా టైప్‌కాస్ట్ చేయబడింది. ప్రతి డైరెక్టర్ ఆమెను అలాంటి పాత్ర చేయాలని అడగడంతో ఇక కెరీర్ తనపై వేశ్య అనే ముద్ర వేసిందని ఆమె ఎంతో బాధపడింది. తనకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చే ఒక్క దర్శకుడు కూడా దొరకడా అని ఎంతో ఆశించింది.

చివరికి తనకు వైవిధ్యమైన పాత్రలు చేసే అవకాశం రావడం కష్టమే అని నిరాశ పడిపోయింది. ప్రజలు ఆమెను బయట కూడా వేశ్యగా చూసేవారు. ఆ ఇమేజ్ కారణంగా ఆమె తన వ్యక్తిగత జీవితంలో కూడా సమస్యలను ఎదుర్కొంది. సరిగ్గా అలాంటి సమయంలో నందమూరి తారక రామారావు తన టైగర్ రాముడు సినిమాలో ఆఫర్ ఇచ్చాడు. దాంతో ఆమె జీవితమే మారిపోయింది. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. రాజ సులోచన కథానాయికగా స్థిరపడింది. ఆమె ఎన్టీఆర్‌తో మరో నాలుగు సినిమాల్లో నటించింది. అవన్నీ కూడా మంచి సక్సెస్ ను సాధించాయి. తన కెరీర్‌లో తరువాత వివిధ క్యారెక్టర్స్‌ కూడా పోషించింది. అలా రాజ సులోచనను వేశ్య పాత్రల నుంచి ఎంతో మంది అభిమానించే హీరోయిన్ గా మార్చడంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -