Lakshmi Parvathi: ఎన్టీఆర్ కుమార్తెలు పురంధేశ్వరి, భువనేశ్వరి దుర్మార్గులు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు!

Lakshmi Parvathi: దివంగత నటుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ తారక రామారావు పేరుపై నేడు వంద రూపాయల నాణెం విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లక్ష్మీపార్వతి మినహా మిగిలిన నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి లక్ష్మీపార్వతిని పిలవకపోవడం పై ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఈ సందర్భంగా ఇదొక ప్రైవేట్ కార్యక్రమం అయితే పర్లేదు కానీ జాతీయ స్థాయిలో జరిగినటువంటి ఎన్టీఆర్ వేడుకకు భార్యగా తనని ఆహ్వానించకపోవడం విడ్డూరమని తెలియజేశారు.ఎన్టీఆర్ కష్టాలలో ఉన్నప్పుడు ఎవరు రాలేదు కానీ నేడు మాత్రం ఆయనని వెన్నుపోటు పొడిచిన వారందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరు అయ్యారని ఈమె మండిపడ్డారు.

 

ఎన్టీఆర్ భార్యగా ఆ గౌరవం అందుకొనే హక్కు నాకు మాత్రమే ఉందని అయితే నాకు ఆహ్వానం అందకుండా ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి చేసి ఉంటారని తెలిపారు. ఎన్టీఆర్ కష్టాలలో ఉన్నప్పుడు వీళ్ళు ఎవరు కూడా ఆయన చెంతకు రాలేదు కానీ ఇప్పుడు మాత్రం వారసులుగా అందరూ అక్కడికి వెళ్లారని ఈ ఫోటోలు చూస్తుంటే ఒక ప్రైవేట్ కార్యక్రమానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా వెళ్ళినట్టు ఉంది అంటూ ఈమె మాట్లాడారు.

 

ఇక ఎన్టీఆర్ కుమార్తెలు అయినటువంటి పురందేశ్వరి భువనేశ్వరి గురించి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై నా టార్గెట్ పురందేశ్వరనీ, తను ఏ నియోజకవర్గంలో పర్యటన చేస్తే నేను కూడా ఆ నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా పర్యటన చేస్తానని లక్ష్మీపార్వతి తెలిపారు. ఇక ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడవడానికి చంద్రబాబు నాయుడు కి సహాయం చేసినది కూడా పురందేశ్వరి అంటూ ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -